ఫిరాయింపులపై హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

8 Jul, 2016 11:36 IST|Sakshi
ఫిరాయింపులపై హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషన్ పై హైకోర్టు వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరలో ఈపిటిషన్ను పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విచారణ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ తన పిటిషన్‌లో కోరింది. గత వారమే ఈ పిటిషన్ విచారణకు రాగా ఆ సమయంలో వాయిదా వేసిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం విచారణ ప్రారంభించి హైకోర్టుకు ఈ సూచనలు చేసింది.

మరిన్ని వార్తలు