ఆసక్తికరంగా ‘బుర్రకథ’ టీజర్‌

6 May, 2019 09:40 IST|Sakshi

ప్రేమ కావాలి, లవ్‌లీ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్‌.. అటుపై సక్సెస్‌ అందుకోలేకపోయారు. చాలా కాలం నుంచి సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం ఓ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న బుర్రకథ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త కథతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో. టీజర్‌తోనే ఈ మూవీ కాన్సెప్ట్‌ను క్లియర్‌గా చెప్పేసింది యూనిట్‌. ఆద్యంతం వినోదాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందించగా.. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు