ప్రేక్షకులకు థ్రిల్

30 Aug, 2016 23:48 IST|Sakshi
ప్రేక్షకులకు థ్రిల్

 సీనియర్ దర్శకుడు వి.సాగర్ నిర్మాతగా మారారు. తమ్ముడైన సీనియర్ కెమెరామన్ శ్రీనివాసరెడ్డి వుయ్యూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ జోత్న్స ఫిలిమ్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘చారుశీల’. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌ను బ్రహ్మానందం, టీజర్‌ను రాజీవ్ కనకాల విడుదల చేశారు. సాగర్ మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది.
 
  1990లో స్టీఫెన్ కింగ్ రాసిన ‘మిజరీ’ నవల ఆధారంగా తెరకెక్కించాం. అన్ని భాషల్లో తీయగల యూనివర్సల్ కథాంశమిది’’ అన్నారు. ఈ చిత్రం తాము హక్కులు కొన్న తమిళ ‘జూలీ గణపతి’కి ఫ్రీమేకంటూ కొందరు కోర్టుకెక్కారు. ఈ వివాదంపై మాట్లా డుతూ, ‘‘చిత్రానికి ఉన్న అడ్డంకులు కోర్టు తీర్పుతో తొలగి పోయాయి. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొ న్నారు. ‘‘ఈ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని బ్రహ్మానందం అన్నారు.