స్పెషల్‌ మూవీ!

11 Oct, 2017 03:48 IST|Sakshi

గోపీచంద్‌ హీరోగా ఎ.యం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆక్సిజన్‌’. రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్యర్య నిర్మించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకను ఈ నెల 15న నెల్లూరులోని శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్‌లో జరుపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయాలనుకుంటున్నారు.

గోపీచంద్‌గారి కెరీర్‌లో స్పెషల్‌ మూవీగా నిలిచే సినిమా ఇది.  ఆయన సపోర్ట్, డెడికేషన్‌ సూపర్‌. మేకింగ్‌వైజ్‌గా ఎక్కడా రాజీ పడలేదు. కీలక పాత్రలో నటించిన జగపతిబాబుగారి నటన ఈ సినిమాకు బిగ్‌ హైలైట్‌. యువన్‌ శంకర్‌ రాజా స్వరపరచిన పాటలు అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి’’ అన్నారు ఎస్‌. ఐశ్యర్య.

మరిన్ని వార్తలు