స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి

21 Nov, 2014 17:12 IST|Sakshi
స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లింగంపల్లి రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపాడు. అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛభారత్ను ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపాడు.

ఇక మరోవైపు మనోజ్ సోదరి, నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఫిల్మ్నగర్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఫిల్మ్నగర్ బస్తీ రోడ్లతో పాటు, అక్కడి ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు.