సినీ దర్శకుడు వీరు పోట్లపై కేసు నమోదు!

16 Aug, 2013 13:47 IST|Sakshi

మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు వీరు పోట్లపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మైక్ టెస్టింగ్ 123 సినిమా హక్కుల్ని ఇస్తానని వీరు మోసం చేసినట్లు జానీ ఫిర్యాదులో తెలిపారు. నిర్మాత జానీ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.