సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

10 Aug, 2019 14:37 IST|Sakshi

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి అనుకోని అతిథి అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కేరళలో భారీ విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  శ్రీమతి దీప సురేందర్ రెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రభాస్‌ ‘సాహో’ సినిమాకి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు.

మరిన్ని వార్తలు