అరడజను సిద్ధం

27 Apr, 2019 00:11 IST|Sakshi
సురేశ్‌బాబు

మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను అందిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ.  ఈ బ్యానర్‌ నుంచి వచ్చే చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఆ నమ్మకంతోనే డి. సురేశ్‌బాబు దాదాపు 12 చిత్రాలను పైప్‌లైన్లో పెట్టారని తెలిసింది. ఇందులో సమంత నటించిన ఓ బేబి, అల్లు శిరీష్‌ ‘ఏబీసీడీ’, ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన ‘దొరసాని’, శ్రీవిష్ణు, నివేథా ధామస్‌ నటిస్తున్న ‘బ్రోచేవారెవరురా’, ‘ఫలక్‌నుమాదాస్‌’, ‘మల్లేశం’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మంచి రిలీజ్‌ డేట్స్‌ చూసి, ఈ చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు