మలుపులో మిస్టరీ

8 Sep, 2018 00:35 IST|Sakshi
సమంత

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్‌’. కన్నడ హిట్‌ మూవీ ‘యు టర్న్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్, వివై కంబైన్స్‌ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ అందుకున్న ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ మిస్టరీగా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్, ప్రమోషనల్‌ వీడియోకి దాదాపు 6.5 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించాం. రెండు భాషల్లోనూ ఒకే రోజు విడుదల చేస్తున్నాం. సమంత నటన, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ పాత్రలు ఆకట్టుకుంటాయి. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం, నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు