థ్రిల్లర్ కథాంశంతో...

23 Nov, 2013 00:52 IST|Sakshi
థ్రిల్లర్ కథాంశంతో...

రణధీర్, గౌతమి జంటగా శివమణిదీప్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. సంపత్‌రాజ్ దర్శకుడు. త్రిపురం సత్యనారాయణ నిర్మాత. 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు మారుతి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా ఇదని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వైజాగ్, అరకు, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో  భాగం కావడం పట్ల చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రచన: భాషాశ్రీ, సంగీతం: నవనీత్ చారి.