ఖడ్గమృగాన్ని చంపేశారు

10 Apr, 2015 14:09 IST|Sakshi
ఖడ్గమృగాన్ని చంపేశారు

కజిరంగ: అసోంలోని కజిరంగ పార్క్లో ఓ ఆడ ఖడ్గ మృగాన్ని ఎవరో దుండగులు చంపేశారు. దాని కొమ్ములు తొలగించి తీసుకొని పారిపోయారు. పార్క్ అధికారుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం బార్బోరిబిల్ ఫారెస్ట్ క్యాంప్లో తుపాకీ పేలుళ్ల చప్పుళ్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన పార్క్ రక్షణ అధికారులు ఏం జరిగి ఉంటుందా అని పెట్రోలింగ్ నిర్వహించగా చనిపోయి రక్తపు మడుగులో పడిఉన్న ఖడ్గమృగం కనిపించింది. అక్కడే వారు ఐదు ఖాళీ తూటాలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఏడాదిలో దొంగల కారణంగా ఖడ్గమృగాలు చనిపోవడం ఇది తొమ్మిదో ఘటన.    
 

>
మరిన్ని వార్తలు