‘బాబు కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వలేదు’

18 Apr, 2020 21:04 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపు వల్లే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించగల్గుతున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైద్య పరీక్షల విషయంలో దేశంలోనే ఏపీ 4వ స్థానంలో ఉందన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్‌ను విమర్శించే అర్హత హైదరాబాద్‌లో కూర్చున చంద్రబాబుకి లేదన్నారు. చంద్రబాబుకి వైద్యపరీక్షల మీద అనుమానం ఉంటే ఏపీకి వచ్చి  చూసుకోవాలని సవాల్‌ విసిరారు.  టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కరోనా పరీక్షలు చేయించుకుంటే ప్రభుత్వం దాచి పెట్టిందేంటో తెలుస్తుందన్నారు. కుప్పం, మంగళగిరి ప్రజలు కష్టాల్లో ఉంటే.. వారిని గాలి కొదిలేసి చంద్రబాబు హైదరాబాద్‌లో వ్యాపారం చేసు​కుంటున్నారని, లోకేష్‌ సైక్లింగ్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌ వేళ అనేక మంది పేద ప్రజలకు మద్దతుగా ఉంటే.. చంద్రబాబు కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మూడుసార్లు సీఎంగా చేసి వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు