'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'

26 Nov, 2016 15:50 IST|Sakshi
'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ‍్బందుల్లో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.9 నుంచి 10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి లోటు బడ్జెట్ రూ.24 వేల కోట్లకు చేరే అవకాశముందన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని ఆయన తేల‍్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అడ్డుగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని యనమల అన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

మరిన్ని వార్తలు