తమిళనాడులో రోడ్డుప్రమాదం : 9 మంది మృతి

9 May, 2016 09:58 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. తూత్తుకుడి సమీపంలో ఆగి ఉన్న వ్యానును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.  వ్యానులోని 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు