గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. నగరానికి వచ్చిన వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదిస్తారు.