తెలంగాణ: 66 పాజిటివ్‌.. ముగ్గురు మృతి

25 May, 2020 22:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాతో సోమవారం మరో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 66 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,920 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా 72 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 700 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు