మంత్రి లక్ష్మారెడ్డిని కలసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత

23 Jun, 2017 02:20 IST|Sakshi

హైదరాబాద్‌: రాష్ట్రపతి పురస్కార గ్రహీత నల్లగొండ జిల్లా చింతపల్లి పీహెచ్‌సీ ఏఎన్‌ఎం గున్న జయ గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. 2017 సంవత్సరానికి కుటుంబ నియంత్రణ, ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు... తదితర అంశాల్లో ఆమె పనితీరుకు పురస్కారం దక్కింది. ఈమేరకు ఆమె మంత్రిని కలసి పురస్కారం గురించి వివరించారు.

మరిన్ని వార్తలు