'అన్ని వర్గాలకు చేరువైన బీజేపీ'

6 Apr, 2015 14:40 IST|Sakshi
'అన్ని వర్గాలకు చేరువైన బీజేపీ'

న్యూఢిల్లీ: తమ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చేరువయిందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. చిన్ననాటి నుంచే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై పార్టీ కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.

బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాంప్రకాశ్ ముఖర్జీకి బీజేపీ నాయకులు నివాళులర్పించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega