37 లక్షలు దాటిన టెస్టులు

1 Sep, 2020 03:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 37 లక్షలు దాటింది. సోమవారం నాటికి ఈ సంఖ్య 37,22,912కు చేరింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఇది దేశంలోనే అత్యధికం. రాష్ట్రంలో 10,004 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ బారిన పడి 83 మంది మృతి చెందారు. సోమవారం ఒక్కరోజే 56,490 టెస్టులు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,34,771 కేసులు నమోదు కాగా, 3,30,526 మంది కోలుకున్నారు. మరో 1,00,276 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ మృతుల సంఖ్య 3,969కి చేరింది. తాజా గణాంకాల ప్రకారం మిలియన్‌ జనాభాకు 69,717 టెస్టులు చేస్తూ ఏపీ దేశంలో ప్రథమస్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు