ఒకే రోజు 10,502 మంది రికవరీ

22 Sep, 2020 04:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. సోమవారం ఉదయం 9 గంటల సమయానికి 56, 569 టెస్టులు చేయగా, 6,235 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 51 మంది కోవిడ్‌ వల్ల మరణించారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 51,60,700 టెస్టులు చేశారు. 6,31,749 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 5,51,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 74,518 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 5,410 మంది కోవిడ్‌తో మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో మిలియన్‌ జనాభాకు  96,642 టెస్టులు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు