సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రికవరీ రేటు 82.37 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 72,233 టెస్ట్లు చేశారు. కొత్తగా 9,536 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 10,131 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 66 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,912కు చేరింది. ఇక ఆదివారం ఉదయం నాటికి మొత్తం 45,99,826 కరోనా నిర్ధారణ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 5,67,123 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో 4,67,139 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పది లక్షల జనాభాకు 86,139 టెస్టులు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.