ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలు

22 Mar, 2023 01:12 IST|Sakshi

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): జిల్లాలో ఉగాది పురస్కారాలకు ముగ్గురు అర్చకులను ఎంపిక చేసినట్లు జిల్లా దేవదాయశాఖాధికారి పులి నారాయణమూర్తి మంగళవారం విలేకర్లకు తెలిపారు. స్మార్త ఆగమ అర్చకుడిని, వైకానస అగమ అర్చకుడితోపాటు వేద పండితుడుని బుధవారం సత్కరించనున్నామన్నారు. రూ.10 116 నగదు అందజేస్తారన్నారు. కాకినాడ దేవాలయంవీధిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకుడు కొత్తలంక కృష్ణశర్మను, యు.కొత్తపల్లి వేణుగోపాలస్వామి దేవస్థానం అర్చకులు భావవరపు వెంకట రామకృష్ణ భాస్కరాచార్యులను, దేవాలయంవీధిలోని భీమేశ్వరస్వామి దేవస్థానం అర్చకుడు పోతా శివభాస్కర్‌శర్మను ఎంపిక చేశామన్నారు. తాడేపల్లిలోని మంగళవారం దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా వీరిని సత్కరించనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు