Sonu Sood Gets Again Notice From BMC Over Illegal Hotel: రియల్ హీరో నటుడు సోనూసూద్కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మరోసారి షాకిచ్చింది. వసతి గృహం కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవవాన్ని హోటల్గా మార్చారని సోనూసూద్కు బీఏమ్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు అక్రంగా హోటల్గా మార్చిన ఆరు అంతస్తుల భవనాన్ని తిరిగి రెషిడెన్షియల్ భవంతిగా మార్చుతానని గతంలో సోనూసూద్ మాట ఇచ్చారని, దానిని ఇంకా నిలబెట్టుకోలేదంటూ బీఎంసీ తమ నోటీసులో గుర్తుచేసింది. కాగా నవంబర్ 15, 2021న బీఎంసీ ఈ నోటీసులు పంపుతూ వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్ను కొనసాగించాలని సోనూసూద్ను హెచ్చరించింది.
చదవండి: Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్ ఇంకేం చూడాల్సి వస్తుందో
కాగా ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు అనే వ్యక్తి సోనూసూద్పై బీఎంసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలికల వసతి గృహన్ని సోనూసూద్ హోటల్గా మార్చారని.. ఇది చట్టరిత్యా నేరం కాబట్టి ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలంటూ తన ఫిర్యాదులో కోరాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్ సూప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్ను వెనక్కు తీసుకుని ఆ హోటల్ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు సోనూసూద్ అంగీకరించారు.
చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే