దర్శకుడు సుందర్‌కి కరోనా .. వెల్లడించిన ఖుష్బూ

12 Apr, 2021 09:03 IST|Sakshi

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌.సి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ఖుష్బూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నా భర్త సుందర్‌కి శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్‌ చేశాం. మా ఇంట్లోవారితో పాటుగా నేను, మా ఆఫీస్‌ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగటివ్‌ వచ్చింది. గడచిన పది రోజుల్లో మా ఆయన్ను కలిసినవారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ఖుష్బూ పేర్కొన్నారు. గతంలో తమిళంలో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అరణ్మనై’కి సుందర్‌ దర్శకుడనే విషయం తెలిసిందే.

చదవండి:
ఓటీటీలో కాదు థియేటర్స్‌లోనే ‘కోబ్రా’ 

రియల్‌ హీరో’ సోనూసూద్‌కి అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు