Notices To Bigg Boss Organizers: బిగ్ బాస్ నిర్వాహకులకు షాకిచ్చిన పోలీసులు!

25 Dec, 2023 21:30 IST|Sakshi

పల్లవి ప్రశాంత్‌ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత  అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 

తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు