Junior Artist Jyothi Reddy: జ్యోతి మృతిపై జూనియర్‌ ఆర్టిస్టులు ఆందోళన..

18 Jan, 2022 20:35 IST|Sakshi

Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్‌ ఆర్టిస్ట్‌ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్‌ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్‌  రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్‌ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు