Udhayanidhi Stalin: సినిమా టికెట్లు అమ్మాలంటూ వేధింపులు నిజమేనా?

23 May, 2022 12:38 IST|Sakshi

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ నటించిన సినిమా టికెట్ల విక్రయాల కోసం టార్గెట్‌ పెట్టి నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని మంత్రి నాజర్‌ స్పష్టం చేశారు.

తిరువళ్లూరు జిల్లా కరుణాకరచ్చేరి– అముదూర్‌మేడు–రామాపురం మధ్య 5.71 కోట్లు వ్యయంతో కూవం నదిపై నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణపు పనులకు ఆయన కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీన్‌, ఎమ్మెల్యే కృష్ణస్వామితో కలిసి ఆదివారం భూమిపూజ చేశారు. కూవం నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి సుమారు 7.5 మీటర్ల వెడల్సు. 83 మీటర్లు పొడవు ఉంటుందన్నారు.

చదవండి 👉🏾 బెడ్‌ సీన్‌ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్‌ రిప్లై

 మే నాలుగో వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే!

మరిన్ని వార్తలు