Soundarya Rajinikanth: మరోసారి తల్లైయిన రజనీకాంత్‌ కూతురు, కొడుకు ఫొటో షేర్‌ చేసిన సౌందర్య

12 Sep, 2022 14:53 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ రెండవసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. దేవుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. ఆదివారం(సెప్టెంబర్‌ 11) వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి మా జీవితాల్లోకి వచ్చాడని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ ఆమె శుభవార్త పంచుకున్నారు.

చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

అంతేకాదు చిన్నారికి వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడిగా పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. కాగా గ్రాఫిక్‌ డిజైనర్‌, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్‌ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. 2017లో మొదటి భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్‌ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి తొలి సంతానంగా నిన్న(ఆదివారం) వీర్‌ జన్మించాడు. 

మరిన్ని వార్తలు