-->

హిట్‌ కాంబినేషన్  రిపీట్‌

26 Mar, 2024 00:28 IST|Sakshi
రామ్‌చరణ్, సుకుమార్‌

హిట్‌ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్‌ అని సమాచారం.

Election 2024

మరిన్ని వార్తలు