Rashmika Mandanna: మాల్దీవుస్ ఫోటో షేర్ చేసిన పుష్ప బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్

9 Oct, 2022 17:37 IST|Sakshi

పుష్ప భామ రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండపై గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇటీవలే వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేయగా ఈ జంటపై సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బ్లాక్‌ కలర్ సన్‌గ్లాసెస్‌తో మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ సన్‌ గ్లాసెస్‌ విజయ్‌ దేవరకొండవే అని.. ఇద్దరు కలిసి వ్యాకేషన్‌కు వెళ్లారని పోస్టులు పెడుతున్నారు. 

(చదవండి: ప్రేమించడానికి టైమ్‌ లేదు : రష్మిక మందన్నా)

రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఓ పువ్వును పట్టుకుని తెల్లటి బుట్ట వైపు చూస్తూ కూర్చుంది. ఆమె తన పోస్ట్‌కు సన్‌ఫ్లవర్‌తో పాటు రెడ్‌హార్ట్‌ సింబల్‌ను జోడించింది.  మాల్దీవుల్లోని ఓజెన్‌ రిజర్వ్‌ బోలిఫుషిగా ప్రాంతాన్ని జియో ట్యాగ్ చేసింది ఈ బుట్టబొమ్మ. కాగా.. రష్మిక, విజయ్ ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్,  నీనా గుప్తా నటించిన గుడ్‌బై చిత్రంలో రష్మిక నటించింది. విజయ్ అనన్య పాండేతో లైగర్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో విజయ్స, రష్మిక జోడి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

మరిన్ని వార్తలు