-->

ఆ రోజులు గుర్తొస్తున్నాయి

10 Mar, 2024 03:49 IST|Sakshi
శ్రీవిష్ణు, వేణుగోపాల్‌

శ్రీవిష్ణు

‘‘లక్కీ మీడియా బ్యానర్‌ ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈ సంస్థతో నాకున్న అనుబంధం గొప్పది. ‘రోటి కపడా రొమాన్స్‌’ టీమ్‌ను చూస్తుంటే నేనీ బ్యానర్‌లో సినిమా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌ చూస్తుంటే యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా అనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు.

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 12న విడుదల కానుంది. ఈ చిత్రం ఎమోషనల్‌ డోస్‌ ప్రీ ట్రైలర్‌ను శ్రీవిష్ణు రిలీజ్‌ చేశారు. ‘‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్‌ బొజ్జం, విక్రమ్‌ రెడ్డి.

Election 2024

మరిన్ని వార్తలు