రెండు చోట్ల దర్శకుని ఫిర్యాదు
సాక్షి, దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణకు చెందిన శబరీష్, అతని కుమారుడు విజయ్కుమార్ తనను మోసగించారని సినీ డైరెక్టర్ ప్రశాంత్రాజ్ చెన్నపట్టణ టౌన్, బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్లలో రెండు చోట్ల ఫిర్యాదు చేశారు. చెన్నపట్టణలోని తన తోటలో ఇల్లు కట్టడానికి కాంట్రాక్టు ఇచ్చి రూ.40 లక్షలు నగదు, కారును ఇచ్చానన్నారు. ఇంటిని నాసిరకంగా నిర్మించి, కారు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.