ఓటీటీకి లాభం రాదు

10 Dec, 2020 06:31 IST|Sakshi
విజయ్‌ సేతుపతి, శ్రుతీ హాసన్‌

విజయ్‌ సేతుపతి, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘లాభం’. సామాజిక అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కొట్టిపారేసింది చిత్రబృందం. ‘‘లాభం’ సినిమా ఓటీటీలో విడుదల అవ్వదు. ముందు థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు నటుడు విజయ్‌ సేతుపతి. రెండేళ్ల విరామం తర్వాత శ్రుతీహాసన్‌ చేసిన తమిళ చిత్రం ఇది. ఇందులో ఆమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తారు.

>
మరిన్ని వార్తలు