Vishal 33: విశాల్‌ పాన్‌ ఇండియా చిత్రం ఖరారు

16 Dec, 2021 20:06 IST|Sakshi

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమి సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధించింది.  ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది. విశాల్ హీరోగా ఎస్ వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్లు గురువారం ప్రకటించారు. విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్టుకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.

మరిన్ని వార్తలు