టీజర్‌ రెడీ 

3 Jan, 2024 00:19 IST|Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది.

ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 5న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలిసి శివ మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు