-->

లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు

17 Mar, 2024 05:33 IST|Sakshi

న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది.

లక్షద్వీప్‌ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్‌ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్‌ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో డీజిల్‌ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది.

Election 2024

మరిన్ని వార్తలు