సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్‌, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే

29 Oct, 2023 15:39 IST|Sakshi

Updates:

గంజి మైదాన్‌లో కాంగ్రెస్‌ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం

►కాంగ్రెస్‌ పేదల కోసం ఆలోచిస్తుంది.
►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు.
►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్‌ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు.
►ఆ తర్వాత రోజే మాట మార్చాడు.

►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించింది.
►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి.
►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా?

►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్‌ తనకునచ్చింది చేశారు.
►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది
►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది

►కాంగ్రెస్‌ పేదల కోసం ఆలోచిస్తుంది.
►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్‌.
►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం.
►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్‌ తనకునచ్చింది చేశారు.

►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం.
►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం.
►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం.
►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం.

►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు.
►రేవంత్‌ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా.
►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్‌ఎస్‌ నేతలను తీసుకెళ్లి చూపించండి.

►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు.
►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా?
►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి.

►సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో కాంగ్రెస్‌ కార్నర్ మీటింగ్‌ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. 

సాక్షి, సంగారెడ్డి:  సంగారెడ్డిలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్‌ వరకు ర్యాలీ కొనసాగింది.

మరిన్ని వార్తలు