సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కింది విధంగా శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది.