మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఏడుకొండలు

26 Sep, 2023 12:13 IST|Sakshi
మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఏడుకొండలు

ఒంగోలు అర్బన్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ఏడుకొండలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్‌ సుధాకర్‌బాబు స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆంధ్రమెడికల్‌ కాలేజీలో రేడియోథెరపీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏడుకొండలు ప్రభుత్వ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయన మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్‌ను ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, జీజీహెచ్‌ అధికారులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు