సెమీస్‌లో ఓడిన అష్మిత 

4 Feb, 2024 03:51 IST|Sakshi

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్‌ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ సుపనిద (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega