సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిని 24 గంటల్లో 1873 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 827 కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 1849 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 92,837. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,299. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 73.3 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.78 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.66 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 37,791 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 13,65,582 నమూనాలు పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది.