తెలంగాణలో ఒక్కరోజే 2892 కేసులు, 10 మరణాలు

2 Sep, 2020 10:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2892 పాజిటివ్‌ కేసులు నమోదవండంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,589 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 846 కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2240 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 97,402.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,341. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.76 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,491 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 14,83,267 కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(చదవండి: మీకు అర్థమవుతోందా..!)

>
మరిన్ని వార్తలు