కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే కన్నుమూత

5 May, 2021 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆర్కేగా సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో  గాంధీ హాస్పిటల్‌లో చేరారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆర్కే ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ఆర్కే స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఎన్‌టీవీలతోపాటు డెక్కన్‌ క్రానికల్‌లో ఆయన పనిచేశారు. ఆర్కే మరణంతో  మీడియా వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.. జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ  మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు

మరిన్ని వార్తలు