Sankranti 2024 Special Trains: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు

10 Jan, 2024 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. మరో ఆరు ప్రత్యేక రైళ్లును ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 10 నుంచి 15 తేదీల్లో ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడవనున్నాయి.

ఆరు స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..
జనవరి 10న రాత్రి 8:25 కి తిరుపతి - సికింద్రాబాద్
జనవరి 11న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్
జనవరి 12న రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ - సికింద్రాబాద్
జనవరి 13న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్
జనవరి 14న ఉదయం 10 గంటలకు కాకినాడ టౌన్ - తిరుపతి
జనవరి 15న తెల్లవారుజామున 5:30 గంటలకు తిరుపతి - కాచిగూడ

 

ఇదీ చదవండి: ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!

>
మరిన్ని వార్తలు