తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్‌పై శ్వేతపత్రం.. చర్చ.. లైవ్‌ అప్‌డేట్స్‌

17 Feb, 2024 20:26 IST|Sakshi

Updates.. 

అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ 

  • వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు
  • రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు 
  • మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్‌ అయింది.. సరి చెయ్యాలి
  • ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్
  • హరీష్ రావు వన్ మెన్ హీరో 
  • మేడిగడ్డలో రిపేర్‌ కాంట్రాక్ట్‌ పెద్ద కాంట్రాక్టర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు

అన్నారం డ్యామేజిపై అసెం‍బ్లీలో వీడియో ప్రదర్శన

  • అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • అన్నారం డ్యామేజి సీరియస్ అంశం 
  • మూడు బ్యారేజిలను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ(ఎన్‌డీఎస్‌ఏ)కు అప్పగిస్తాం
  • ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు..
  • ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం
  • అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
  • కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్‌పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు
  • ఒకనాడు కేసీఆర్‌కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది
  • ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు.
  • ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది
  • ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా

హరీష్‌రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ

  • నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు
  • ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు
  • ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు
  • నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్‌కు స్లిప్ పంపుతున్నారు
  • నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను
  • నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను
  • నిన్ననే అసెంబ్లీ క్లోజ్  చేయమని చెప్పాం
  • 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు..

మంత్రి భట్టి మాట్లాడుతూ.. 

  • కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేశారు
  • రీడిజైన్‌ పేరుతో అంచనాలు పెంచారు
  • లక్షల కోట్లు వృధా చేశారు
  • హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి

సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 

  • కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు
  • కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది
  • సాగునీటి మంత్రిగా హరీష్‌ను ఎందుకు తప్పించారు
  • ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు
  • ఈ పాపాలన్నింటికి హరీష్‌, కేసీఆరే కారణం
  • తెలంగాణను చెదలు పట్టించారు
  • హరీష్‌ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు
  • చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు
  • ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్‌ను సమర్థిస్తున్నారు  
  • చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు
  • కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్‌లో చేరాక అలా తయాయ్యాడు
  • అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్‌ మారిపోతుంది
  • కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి
  • విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి

మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. 

  • మాటలతో ప్రజల్ని నమ్మించలేరు
  • గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు

హరీష్‌రావు మాట్లాడుతూ.. 

  • సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు
  • సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం
  • మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే 
  • క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్‌
  • గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్‌ కూలాయి
  • మిషన్‌ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది
  • ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది
  • మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు
  • కేసీఆర్‌ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్‌ ఉద్దేశం

మేడిగడ్డ.. కేసీఆర్‌ ఆలోచనే: సీఎం రేవంత్‌రెడ్డి

  • కేసీఆర్‌ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది
  • మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్‌ఆలోచన
  • అక్కడే కట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు
  • వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు
  • వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు
  • మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది
  • హరీష్‌రావు,  వాళ్ల మామ కేసీఆర్‌ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..

  • ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది
  • తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది
  • తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే
  • పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్‌ ఎక్కడ ఉన్నారు?
  • పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్‌ ఎంపీలే
  • గోదావరి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమిటీ వేసింది
  • ఆ కమిటీ నివేదిక ఇచ్చింది
  • ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం
  • ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్‌ బయటపెట్టే యత్నం చేస్తున్నారు
  • ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది
  • వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు
  • తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి
     

మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ..

  • ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో  ఎక్కువ దోపిడీ జరిగింది
  • హరీష్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు
  • గోబెల్స్‌ హరీష్‌రావు అని పేరు పెట్టుకోండి
  • పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి

హరీష్‌రావు మాట్లాడుతూ.. 

  • ఉత్తమ్‌ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు
  • అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం
  • కాంగ్రెస్‌ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు
  • ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు
  • ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్‌ చేశాం
  • ఎస్‌ఆర్‌ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది
  • తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి
  • తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి
  • ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు
  • అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ

మంత్రి భట్టి మాట్లాడుతూ.. 

  • మేడిగడ్డ పిల్లర్‌ నిట్టనిలువునా చీటింది
  • కాళేశ్వరంలో నాణ్యత లేదు
  • మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది
  • రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది
  • గత గవర్నర్‌ హరీష్‌రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు
  • ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్‌ కూడా చెప్పింది 
  • ఉత్తమ్‌ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి
  • కూలిన దానికి తప్పు ఒప్పుకోండి
  • ఇంకా సమర్థించుకోవడం సరికాదు

ఇరిగేషన్‌పై వాడీవేడి వాదనలు

  • ఇరిగేషన్‌ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం
  • మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్‌ చేసిన అధికార పక్షం
  • తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విమర్శలు
  • లేచి బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి

  • కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి
  • మరి స్మితా సబర్వాల్‌ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి

  

మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 

  • హరీష్‌రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు
  • కేసీఆర్‌, జగన్‌ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు
  • అపెక్స్‌ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది

శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం

  • తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు
  • ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్‌ నొటిఫికేషన్‌ను మేం వ్యతిరేకించాం
  • మళ్లీ కాంగ్రెస్‌ గోబెల్స్‌ ప్రచారానికి దిగింది
  • ఎన్నికల ప్రచారంలో గోబెల్స్‌ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు
  • కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
  • ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు
  • రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు పూర్తి చేశాం
  • సభను ఉత్తమ్‌ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు

హరీష్‌రావు మాట్లాడుతూ.. 

  • ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది
  • మంత్రి ఉత్తమ్‌ సత్యదూరమైన మాటలు చెప్పారు
  • గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు
  • మిడ్‌మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం
  • ఇరిగేషన్‌పై చర్చకు 2గం. సమయం అవసరం


మంత్రి ఉత్తమ్‌ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు
  • రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం
  • కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం
  • మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం
  • గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు.
  • అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.


సభలో మంత్రి ఉత్తమ్‌..

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది
  • ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది
  • మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది
  • ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది
  • ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు
  • గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది
  • ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి
  • అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు
  • ప్రాజెక్టుల రీడిజైన్‌ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది
  • తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైంది
  • గతంలో.. అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ గత సీఎం కూడా పాల్గొన్నారు
  • అప్పుడే కేఆర్‌ఎంబీకి నోటిఫికేషన్‌ను కేంద్రం రిలీజ్‌ చేసింది
  • కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు
  • కేఆర్‌ఎంబీకి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాచింయింది
  • కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది
  • కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది
  • తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది
  • పోలింగ్‌ రోజు సాగర్‌ నుంచి అదనపు నీటిని తీసుకుంది
  • బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది
  • శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్‌ఎస్‌ అప్పుడు పట్టించుకోలేదు

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ చెబుతోంది
  • ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది
  • ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది
  • బీఆర్‌ఎస్‌ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి
  • ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు


సభలో మంత్రి ఉత్తమ్‌..

  • కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు
  • మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్..  కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం
  • మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది
  • కానీ, కాగ్‌ అనేక లోపాలు బయటపెట్టింది
  • మల్లన్న సాగర్  ప్రమాదంలో ఉందని కాగ్‌ రిపోర్ట్ ఇచ్చింది
  • చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్‌ తట్టుకోలేదు
  • మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్‌ పేర్కొంది

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది
  • కానీ, కాగ్‌ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే  విషయాలు కాగ్‌ చెప్పింది
  • కరెంట్‌ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది
  • డీపీఆర్‌ అఫ్రూవ్‌ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20  వేల కోట్లు కట్టబెట్టింది
  • కాగ్‌ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం
  • గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు
  • మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం
  • ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి
  • మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు
  • అన్నారంకు క్రాక్స్‌ వచ్చాయి 
  • అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది
  • అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి
  • వెంటనే ఎన్‌డీఎస్‌ఏకి సమాచారం అందించాం
  • నీటిని నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ చెబుతోంది
  • ఉన్న నీటిని తొలగించమని చెప్పింది
     

సభలో మంత్రి ఉత్తమ్‌..

  • మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది
  • మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది
  • అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్‌ ఇప్పటిదాకా స్పందించలేదు
  • అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్‌ బాగా దెబ్బతింది
  • గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్‌ ఇంజనీర్‌.. డిజైనర్‌
  • గత పదేళ్లలో ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు
  • ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు
  • యావత్‌ తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ క్షమాపణలు చెప్పాలి
  • నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం 

నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం

  • 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు
  • మొత్తం ఖర్చు 54,234కోట్లు
  • 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు
  • 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు
  • కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు
  • ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు

సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. 

  • ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌
  • సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం
  • కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు
  • కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది
  • మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్‌
  • అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు
  • మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది
  • వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్‌.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది
  • రూ.1,800 కోట్లకు టెండర్‌ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు
  • ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు
  • నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది
  • ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది

అసెంబ్లీ స్పీకర్

  • అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా
  • గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు
  • నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు

మంత్రి శ్రీధర్ బాబు..

  • గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు
  • స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు


 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు..

  • మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు
  • అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు
  • టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు
  • మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి
  • టెక్నీషియన్ ను బయటకు పంపాలి

ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్‌

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. 
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం
  • కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు.
  • మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం.
  • మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం.
  • ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా?
  • అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి.
  • మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం.
  • మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం.
  • ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం

►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. 

►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 

►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది.

►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్‌ సర్కార్.

►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం

►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు

►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌

►నిన్న జరగాల్సిన ఇరిగేషన్‌పై చర్చ నేటికి వాయిదా

►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు

►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా.

whatsapp channel

మరిన్ని వార్తలు