నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

13 Aug, 2020 01:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఉత్తరాంధ్ర–ఒడిశా తీరాలకు దగ్గర్లో వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌–పట్టణ, వరంగల్‌–గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు