-
నిష్పక్షపాతంగా ఓటు వేయండి
జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్బాషాబాపట్ల: జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. స్వీప్ (ఓటు హక్కు అవగాహన) కార్యక్రమాన్ని సోమవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా, ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన బెలూన్ను గాలిలోకి కలెక్టర్ ఎగురవేశారు. అనంతరం తొలి సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుడూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని చెప్పారు. సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు మీ ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి స్వేచ్ఛాయుత వాతావరణ కల్పిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, స్వీప్ జిల్లా నోడల్ అధికారి వై. పిచ్చిరెడ్డి, ఐటీ నోడల్ ఆఫీసర్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, పాల్గొన్నారు. -
రేపల్లె మురిసింది..అద్దంకి అదిరింది
అశేష జనవాహిని వెంటరాగా.. వైఎస్సార్ సీపీ రేపల్లె, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ ఈవూరి గణేష్, పానెం చిన హనిమిరెడ్డి తమ నామినేషన్లను సోమవారం దాఖలు చేశారు. ఎండను సైతం లెక్కచేయని అభిమాన నీరాజనం ఎన్నికల్లో వారి విజయాన్ని సగం ఖరారు చేసింది. భారీ బైక్ ర్యాలీలు, తీన్మార్ డ్యాన్స్లు, గజమాలల ఘన స్వాగతం, జన జాతరతో రేపల్లె మురవగా.. అద్దంకి అదరిపోయింది. ఈవూరి వెంట ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, హనిమిరెడ్డి వెంట బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. – అద్దంకి, రేపల్లె రూరల్ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్పీ రెడ్డి
చుండూరు (భట్టిప్రోలు): చుండూరు మండలం చినపరిమి గ్రామానికి చెందిన కొండా శివ ప్రసాద్ రెడ్డిని(ఎస్పీ రెడ్డి) వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన ప్రస్తుతం భట్టిప్రోలు మండల పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. తన నియామకానికి కృషిచేసిన వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బాపట్ల జిల్లా సమన్వయకర్త మోపిదేవి వెంకట రమణారావు, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్ధి వరికూటి అశోక్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవిని ఇచ్చిన సీఎం జగన్కు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శాయశక్తులా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి
రేపల్లె రూరల్ : వైఎస్సార్ సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు సోమవారం వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రేపల్లె పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. వైఎస్సార్ సీపీలో నాయకులకు, కార్యకర్తలకు సముచితస్థానం కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొక్కిలిగడ్డ విష్ణు, మోపిదేవి చందు, కొక్కిలిగడ్డ జనార్ధన్, శివనాగరాజు, కర్రి సాంబశివరావు, కర్రి ప్రసాద్, కర్రి రాంబాబు, శేరు శ్రీనివాసరావు, పీతా లక్ష్మణరావులతో పాటు మరికొన్ని కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పీతా వెంకటేశ్వరరావు, నాయకులు కొక్కిలిగడ్డ నాంచారయ్య, చెన్ను లక్ష్మణరావు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో 50 టీడీపీ కుటుంబాల చేరిక పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు -
జిల్లాలో పదింతల ఆనందం
బాపట్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాట్టారు. కార్పొరేటుకు దీటుగా పోటీపడ్డారు. జిల్లాలో 336 పాఠశాలల ఉండగా ఆయా పాఠశాలల నుంచి 8497 మంది బాలురు, 8221 మంది బాలికలు కలిపి మొత్తం 16718 పరీక్షలు రాశారు. ఇందులో 7335 మంది బాలురు, 7408 మంది బాలికలు కలిసి మొత్తం 14743 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 86.32 శాతం, బాలికలు 90.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 88.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాపట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన షేక్ రెహాన్ హఫీజ్ 595/600 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో, పర్చూరులోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్కు చెందిన ఒగ్గిశెట్టి ఆక్షయ 594 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో, అద్దంకి హోలిఫెయిత్ స్కూల్కు చెందిన గాలి యశ్వంత్ 593 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 590 మార్కులుపైగా 30 మంది జిల్లాలో 590 మార్కులు పైగా 30 మంది విద్యార్థులు సాధించారు. వారిలో తొమ్మిది మంది బాలురు ఉండగా, 21 మంది బాలికలే ఉన్నారు. వారిలో బాపట్లకు చెందిన మువ్వల సాయి విష్ణుశశాంక్ (593, శ్రీచైతన్య, బాపట్ల), కె. నిఖిత (593, శ్రీచైతన్య, చీరాల), ఎం. శ్రీముఖి(593, డ్రీమ్స్ హైస్కూల్, పోసపాడు), ఎం. శైలేశ్వరి (592, ఎంఎంఆర్ హైస్కూల్, ఇంకొల్లు), గుంటూరు వెంకటరామ నాగలక్ష్మి (592,డ్రీమ్స్ హస్కూల్, పోసపాడు), అక్కల భానుతేజరెడ్డి (592, భాష్యం, అద్దంకి), గవిని శివకుమారి (592, శ్రీచైతన్య, బాపట్ల), షేక్ తోహిత్ హుస్సేన్ (592, అక్షర్ విద్యాభవన్, బాపట్ల), బుర్ల నాగభువనేశ్వరి (592, శ్రీచైతన్య చీరాల), షేక్ నాగూర్వలి (591, జడ్పీ హైస్కూల్, వల్లపర్ల), వి. హిమజశ్రీ (591, విజ్ఞాన్ భారతి, చీరాల), ఎన్. నిఖిత (591, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, పర్చూరు), కె. వెంకటసాయి విద్యశ్రీ (591, శ్రీచైతన్య, అద్దంకి), షేక్ ఫరీద్నిదా (591, శ్రీచైతన్య, బాపట్ల), చేబ్రోలు విజయ్ (591, రవీంద్రభారతి, బాపట్ల), పులుగు యశ్వంత్ (591, విజ్ఞానభారతి, చీరాల), కారంకి తనూజ (591, శ్రీచైతన్య, చీరాల), బి. నందిని (591, బాలయేసు స్కూల్, నగరం), శ్యామల తనూజ (590, ఎస్ఎఫ్ఎస్, స్కూల్, నాగులపాలెం), కోళ్లపూడి శ్రీహర్షిత (590, ఆక్స్ఫర్, పర్చూరు), పాలశెట్టి అక్షయశ్రీ (590, లిటిల్ ఏంజెల్స్, బాపట్ల), పఠాన్ షాలేహా (590, సందీప్ స్కూల్, చీరాల), పి. సాయి హర్షితారెడ్డి (590, చీరాల), డి. కుందన (590, డ్రీమ్స్ హైస్కూల్, ఇంకొల్లు), తాతా మహేష్బాబు (590, డ్రీమ్స్ హైస్కూల్, ఇంకొల్లు), పి. శ్రీవర్షిణి (590, రాయల్ హైస్కూల్, మార్చూరు), వి. నందిని (590, శ్రీచైతన్య, మార్టూరు) 61 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత జిల్లాలో మొత్తం 336 పాఠశాలలు ఉండగా వాటిల్లో 61 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో జిల్లా పరిషత్ 19, ప్రైవేటు 37, గురుకుల పాఠశాల 1, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ 1, ఎయిడెడ్ 3 పాఠశాలలు ఉన్నాయి. టెన్త్లో 88.19 శాతం ఉత్తీర్ణత 61 పాఠశాలల్లో 100 శాతం 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 మంది ఇందులో తొమ్మిది మంది బాలురు, 21 మంది బాలికలు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు -
నిష్పక్షపాతంగా ఓటు వేయండి
జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్బాషాబాపట్ల: జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. స్వీప్ (ఓటు హక్కు అవగాహన) కార్యక్రమాన్ని సోమవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా, ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన బెలూన్ను గాలిలోకి కలెక్టర్ ఎగురవేశారు. అనంతరం తొలి సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుడూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని చెప్పారు. సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు మీ ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి స్వేచ్ఛాయుత వాతావరణ కల్పిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, స్వీప్ జిల్లా నోడల్ అధికారి వై. పిచ్చిరెడ్డి, ఐటీ నోడల్ ఆఫీసర్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, పాల్గొన్నారు. -
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
నాదెండ్ల: ఈత సరదా ముగ్గురు మరణాలకు కారణమైంది. ఈ విషాద సంఘటన పల్నాడు జిల్లా కనపర్రు నుంచి సాతులూరు వెళ్లే మార్గమధ్యలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం, మొలకలూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గేరా పురుషోత్తం (20), బోరుగడ్డ ఆకాష్(20), చలమల రాజు (20) ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు ఉపక్రమించారు. కాలువ పక్కనే బైక్ను నిలిపి చెప్పులు, దుస్తులు, సెల్ఫోన్లు గట్టుపై పెట్టి కాలువలోకి దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న ఎండుగుంపాలెం వాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామ్రెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల మృతితో మొలకలూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురూ స్నేహితులే... మృతులు ముగ్గురు స్నేహితులు. వేర్వేరు పనులు చేసుకుని జీవిస్తుంటారు. గేరా పురుషోత్తం ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. తండ్రి రాజేష్ వ్యవసాయకూలి. బోరుగడ్డ ఆకాశ్ కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తండ్రి బాజీ కూలిపనులు చేస్తుంటాడు. చలమల రాజు తెలంగాణలోని నల్గొండ చెక్పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగే వేడుకకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఇంటికి చేరకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతుకులాట ప్రారంభించారు. కాలువలో మృతదేహాలున్నాయన్న సమాచారంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు. కనపర్రు – సాతులూరు మధ్య సాగర్ కాల్వ వద్ద ఘటన -
‘ఆమంచి’ అరాచకాలను అడ్డుకోండి
చీరాల: నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి అరాచకాలను అడ్డుకోవాలని, ఓట్లు కొనుగోలుకు పాల్పడుతున్నారని చీరాలకు చెందిన నాయుడు నాగార్జునరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు సోమవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 9న పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో జరిగిన సమావేశంలో మత్స్యకార గ్రామ పెద్దలను లోబరుచుకుని 1700 ఓట్లు ఉన్న గ్రామాన్ని రూ.64 లక్షలకు కొనుగోలు చేశానని ఆమంచి ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా విద్యుత్ బకాయిలు రూ.3.50 కోట్లు చెల్లించకుండా ఆ శాఖ అధికారులను బెదిరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలలో కూడా ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా ఆమంచి కృష్ణమోహన్ అవినీతి, అక్రమాలు బహిర్గతం చేసిన తనపై కక్షగట్టి కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో తనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలకు పాల్పడ్డారని చెప్పారు. సుమారు 15 సార్లు భౌతిక దాడులకు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఓట్లు కొనుగోలుపై చర్యలు తీసుకోవాలి ఈసీకి ఫిర్యాదు చేసిన నాగార్జునరెడ్డి -
పల్నాడు కలెక్టర్ పల్లెనిద్ర
వెల్దుర్తి: మండలంలోని మండాది గ్రామంలో కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. శ్యాం ప్రసాద్లు ఆదివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండాది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి పాఠశాలలో ఏర్పాటు చేసి న గదిలో పల్లె నిద్ర చేశారు. సోమవారం ఉదయం గ్రామంలో తిరిగి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వారికి నచ్చిన పార్టీలకే వేసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఒత్తిడిలు, ప్రలోభాలు పెడితే వెంటనే ఎన్నికల అధికారికి సమాచారమివ్వాలన్నారు. అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని గుండ్లపాడులో ఉన్న నాలుగు పోలింగ్ బూత్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఓటర్లతో మాట్లాడా రు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీహరిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. -
తీరని రోదన
వేటపాలెం: ఎదురుగా వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన చీరాల – వేటపాలెం బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నగంజాం మండలం కొత్త పాలేనికి చెందిన స్నేహలత తన ఏడాది కూతురు అన్విత, తల్లి బొడ్డు సుబ్బరావమ్మ (57)ను స్కూటీ పై ఎక్కించుకొని బాపట్ల అత్తగారింటికి బయలుదేరింది. అక్కాయిపాలెం దగ్గరకు రాగానే ఎదురుగా ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. స్కూటీ వెనక కూర్చొన్న సుబ్బరావమ్మ, తనఒడిలో ఉన్న ఏడాది పాప లారీ కింద పడ్డారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడికే మృతి చెందారు. స్నేహలత మరో వైపునకు పడి పోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. కళ్లెదుటే తన పాప, తల్లి మృత్యువాత పడటంతో స్నేహలత బోరున విలపించింది. ఘటనా స్థలానికి ఎస్సై జి.సురేష్ చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీని ఢీకొట్టిన లారీ అమ్మమ్మ, ఏడాది మనవరాలు మృతి -
చీరాలలో కరణం మొదటి సెట్ దాఖలు
చీరాల: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నాలుగోరోజు సోమవారం తొమ్మిది మంది అభ్యర్థులు నానినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి జి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఉదయం 11.7 నిమిషాలకు మొదటి సెట్ నామినేషన్ను ఆర్వోకు అందించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, బీఎస్పీ అభ్యర్థిగా కాటి మార్క్, రిఫార్మ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా తన్నీరు విజయ్, స్వతంత్ర అభ్యర్థిగా తేళ్ల రాంబాబు, టీడీపీ అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య, ఆయన భార్య బాలకొండమ్మ తరఫున రెండు సెట్లు, కాంగ్రెస్ తరఫున ఆమంచి కృష్ణమోహన్, పోలిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ను ఆర్వోకు అందించారు. -
రేపు కరణం వెంకటేష్ నామినేషన్
చీరాల: వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని చీరాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కోరారు. సోమవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రామకృష్ణాపురంలోని తన ఇంటి నుంచి బుధవారం నామినేషన్ కార్యక్రమం ప్రసాద్ థియేటర్, కొట్లబజార్, ముంతావారి సెంటర్, గడియార స్తంభం సెంటర్, అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జరుగుతుందని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జైసన్బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కె.బాబ్జి, రూరల్ అధ్యక్షుడు అంకాళరెడ్డి, వేటపాలెం అధ్యక్షుడు బి.సుబ్బారావు, కార్పొరేషన్ల డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, ఎం.వైష్ణవి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.జిల్లాలో నామినేషన్ల జోరు సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. బాపట్ల పార్లమెంట్ నుంచి నవతరం పార్టీ అభ్యర్థిగా నలమర్ల తరుపతిరావు, జయభీమ్ రావు భారత్ పార్టీ నుంచి పర్రె కోటయ్య నామినేషన్లు దాఖలు చేశారు. చీరాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్, కరణం బలరాం కృష్ణమూర్తి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్య ర్థిగా ఎంఎం కొండయ్య, బాల కొండమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి కాటి మార్క్, రిఫార్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తన్నీరు విజయ్, స్వతంత్య్ర అభ్యర్థులుగా శ్రీనివాసరావు, లేళ్ల రాంబాబులు నామినేషన్లు దాఖలు చేశారు. ● వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు, వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్బాబు, వరికూటి గౌతమ్, జయభారత్ నేషనల్ పార్టీ తరపున భాగ్యరాజు నామినేషన్లు వేశారు. ● అద్దంకి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పానెం చిన హనిమిరెడ్డి, పానెం ఆదిలక్ష్మి, జయ భీమ్ భారత్ పార్టీ పి.హేబేలు, జాతీయ సమ సమాజం పార్టీ నుంచి బాచిన రాంబాబు, నవోదయ పార్టీ తరపున కుంటుపల్లి గోపి, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాసరావు, పి. శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు. ● పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు నామినేషన్లు దాఖలు చేశారు. ● రేపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈవూరి గణేష్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెల్లంకొండ సుబ్బారావు, స్వతంత్య్ర అభ్యర్థిగా రాంబాబు నామినేషన్లు దాఖలు చేశారు.25న ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష చిలకలూరిపేట టౌన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలల్లో 5,6,7,8వ తరగతుల ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు రాజాపేట ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. సుబ్రహ్మణ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి ఏపీఆర్ఎస్ క్యాట్ –2024 పేరిటా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. హాల్ టికెట్లను విద్యార్థిలకు పంపమని, httr://aprr.apcfrr.in అనే విద్యాలయ ప్రత్యేక వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. ఐడీ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. -
ఫ్యాన్ ప్రభంజనాన్ని ఓటర్లు చూపించాలి
పర్చూరు (చినగంజాం): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అజెండాగా నాయకులు నియోజక వర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని పర్చూరు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి యడం బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం చీరాలలోని పార్టీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిందని, అందరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారితో ఓటు వేయించేందుకు అవసరమైన అవకాశాలను నాయకులు కల్పించాలని సూచించారు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యడం బాలాజీ సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో తమ్మలూరి అనిల్, మల్లెల పోతురాజు తదితరులున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి అభ్యర్థి బాలాజీ సాదరంగా ఆహ్వానించారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రావూరు సాల్మన్, నిదానపు కిషోర్, యెడ్డలూరి రాజేష్లు.మాజీ ఎంపీటీసీ బట్టు శంకరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పర్చూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ టీడీపీ నుంచి పార్టీలోకి భారీగా చేరికలు -
చిన హనిమిరెడ్డి ఆస్తుల వివరాలు
అద్దంకి: ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంకిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సురేష్ మాట్లాడుతూ అద్దంకికి హనిమిరెడ్డి లాంటి మంచి వ్యక్తి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరికాడని తెలిపారు. ఆయన్ను గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. హనిమిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్కు స్వచ్ఛందంగా హాజరైన నాయకులు, కార్యకర్తలను చూసి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయమని పేర్కొన్నారు. ఈ అభిమానాన్ని బట్టి ఈసారి అద్దంకిలో భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఐదు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఉప్పొంగిన అభిమానం తరంగం అభిమాన తరంగం ఎగసిందా అన్నట్లు ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్కు తరలివచ్చారు. భారీ గజమాలతో అభిమాన నేతల్ని సత్కరించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే అద్దంకి భవానీ సెంటర్కు చేరుకున్నారు. మోటార్ బైకులపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా డ్యాన్స్లు చేశారు. నామినేషన్కి వచ్చిన జనాన్ని చూస్తే ఈసారి వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అట్టహాసంగా ర్యాలీ శింగరకొండలో తొలుత చిన హనిమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అట్టహాసంగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేడ్కర్ విగ్రహం వరకు తరలి వెళ్లారు. తరువాత తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వై.వి. భద్రారెడ్డి పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉంటూ అతిథిగా నియోజకవర్గానికి వచ్చి ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల్ని నమ్మరాదని సూచించారు. నిజాంపట్నానికి వాన్పిక్ ప్రాజెక్ట్ వస్తే తీరప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించేవని తెలిపారు. విషపు రాజకీయాలతో వాన్పిక్ ప్రాజెక్ట్ను అడ్డుకున్నది చంద్రబాబేనని, నేడు అది వస్తే ఉద్యోగాలు వచ్చేవంటూ మొసలి కన్నీరు కార్చుతున్నాడని ధ్వజమెత్తారు. ఆ నాడు కేంద్రంలోని సోనియాగాంధీ కాళ్లుపట్టుకుని వాన్పిక్ ప్రాజెక్ట్ను అడ్డుకోవటంతో పాటు జగన్మోహన్రెడ్డితో పాటు తనపై అక్రమ కేసులు పెట్టిన ప్రధాన కారకరుడు చంద్రబాబేనని ఆరోపించారు. రంగా హత్యలో ప్రధాన కారకుడైన చంద్రబాబు పంచన పవన్ కల్యాణ్ చేరి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని తెలిపారు. కాపులకు ఆది నుంచి రాజకీయ అవకాశాలు, అండదండలు కల్పించింది ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అయితే, నేడు జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారని వివరించారు. గతంలో దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన మూడు శాతం రిజర్వేషన్ను తమ కూటమి అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రసంగించటాన్ని ముస్లింలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అధికారం కోసమే అపవిత్ర కలయికతో ఎన్నికలకు సిద్ధమైన కూటమి నేతల్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800కోట్లకుపైగా నిధులతో నియోజకవర్గ రూపురేఖలతో పాటు పట్టణ రూపురేఖలు మార్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అద్దంకిలో అట్టహాసంగా హనిమిరెడ్డి నామినేషన్ తరలివచ్చిన అశేష ప్రజలు తొలుత శింగరకొండలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వెంకారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి సోమవారం ఆస్తులను ప్రకటించారు. అఫిడవిట్లో చూపిన వివరాల ప్రకారం ఆయనది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీలో ఎంబీఏ చదివారు. ఆయనకు చరాస్తులు రూ.9,61,49,916, భార్యకు రూ.35,57,436 ఉన్నాయి. స్థిరాస్తులు రూ.9,56,77,000 ఉన్నట్లు చూపించారు. దీంతో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, రెసిడెన్షియల్ భవనాల వివరాలు, వాటి విలువ పొందుపరిచారు. -
No Headline
రేపల్లె రూరల్: రేపల్లెలో ఫ్యాన్ గాలి ముందే వీచింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మద్దతుతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ఈవూరు గణేష్ సోమవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య నామినేషన్ వేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జెండాలు రెపరెపలాడాయి. జైజై జగనన్న... జైజై మోపిదేవి.. జైజై గణేష్ల అంటూ అభిమాన గళంతో రేపల్లె పట్టణం హోరెత్తింది. నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె రూరల్, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల నుంచి వచ్చిన ప్రజలతో రేపల్లె పట్టణం కిక్కిరిసిపోయింది. తొలుత పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి నామినేషన్ దాఖలుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, అభ్యర్థి డాక్టర్ గణేష్ బయలుదేరారు. బస్టాండ్ సెంటర్, రాజ్యలక్ష్మి థియేటర్, పద్మావతి థియేటర్ల మీదుగా నెహ్రూ బొమ్మ సెంటర్, అంబేడ్కర్ విగ్రహం సెంటర్ల మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అడుగడుగునా ఎంపీ మోపిదేవికి, అభ్యర్థి గణేష్కు ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం డాక్టర్ గణేష్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో హెలా షారోన్కు నామినేషన్ పత్రాల్ని అందజేశారు. తొలుత తాలూకా సెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపల్లెలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం: గణేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సహకారంతో రేపల్లె నియోజకవర్గంలో వెఎస్సార్ సీపీ విజయం ఖాయమని డాక్టర్ ఈవూరు గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేపల్లె గడ్డపై వైఎస్సార్ సీపీ విజయ ఢంకా మోగించడం తథ్యమని తెలిపారు. బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థిగా నందిగం సురేష్, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నకు రేపల్లె అసెంబ్లీని కానుకగా అందించాలని కోరారు. రానున్నది వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వమే అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోమారు ముఖ్యమంత్రిగా జగనన్న నాయకత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ ఈవూరు గణేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం విచ్చేసిన అశేష జనవాహినితో తాలూకా సెంటరులో మోపిదేవి మాట్లాడారు. కులరాజకీయాలను వీడి అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు అడపా శేషు, గాదె మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, రేపల్లె, రేపల్లె రూరల్, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, వీరంకి ముక్తేశ్వరరావు, పయనం ఏడుకొండలు రెడ్డి, ఎంపీపీలు చింతల శ్రీకృష్ణయ్య, మత్తి దివాకర రత్నప్రసాద్, మోపిదేవి విజయ నిర్మల హరనాథ్బాబు పాల్గొన్నారు. రేపల్లెలో అట్టహాసంగా డాక్టర్ గణేష్ నామినేషన్ దాఖలు అశేష జనవాహినితో తిరునాళ్లను తలపించిన కార్యక్రమం జన సంద్రమైన పట్టణ రహదారులు -
కరణం వెంకటేష్ ఆస్తులివే..
చీరాల: చీరాల వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రంలో ఆస్తులు, అప్పులను ప్రకటించారు. కరణం వెంకటేష్ తన పేరుపై రూ.13,37,90,250లు, భార్య కరణం గీత పేరు మీద రూ.8,06,89,600 ఆస్తులు ఉన్నట్లు చూపారు. వెంకటేష్కు రూ.1,13,32,624లు, భార్య గీత పేరుమీద రూ.87,00,511లు అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. అలానే తన వద్ద రూ.45,000 నగదు, తన భార్య వద్ద రూ.30,000 నగదు ఉందని, తన పేరుమీద ఫార్చూనర్ కారు, ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. ఏలూరికి వాహనమే లేదంటా.. ! చినగంజాం: పర్చూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఏలూరి సాంబశివరావు తన అఫిడవిట్ ఆస్తుల వివరాలను ఆర్వో సమక్షంలో ఎలక్షన్ కమిషన్కు సమర్పించారు. తన పేర స్థిర, చరాస్తులు రూ.19.99 కోట్లు భార్య ఎస్.మాలతి పేరు మీద రూ.187 కోట్లు, పెద్ద కుమారుడు దివ్యేష్పై రూ.41.58 కోట్లు, రెండవ కుమారుడు మైనాంక్ తారక్ పేరు మీద రూ.41.40 కోట్లు ఉన్నట్లు చూపారు. భార్య మాలతి పేరు మీద అప్పు రూ.8.87 కోట్లు ఉన్నాయని, వారికి ఎలాంటి వాహనాలు లేవని అఫిడవిట్లో చూపారు. ఏలూరి సాంబశివరావుపై అఫిడవిట్ ప్రకారం ఇప్పటి వరకు 6 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎలాంటి చార్జి షీట్లు దాఖలు కాలేదు. -
చీరాలలో కరణం మొదటి సెట్ దాఖలు
చీరాల: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నాలుగోరోజు సోమవారం తొమ్మిది మంది అభ్యర్థులు నానినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి జి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఉదయం 11.7 నిమిషాలకు మొదటి సెట్ నామినేషన్ను ఆర్వోకు అందించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, బీఎస్పీ అభ్యర్థిగా కాటి మార్క్, రిఫార్మ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా తన్నీరు విజయ్, స్వతంత్ర అభ్యర్థిగా తేళ్ల రాంబాబు, టీడీపీ అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య, ఆయన భార్య బాలకొండమ్మ తరఫున రెండు సెట్లు, కాంగ్రెస్ తరఫున ఆమంచి కృష్ణమోహన్, పోలిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ను ఆర్వోకు అందించారు. -
అఖండ హనుమాన్ చాలీసా పారాయణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుంటూరు జిల్లా పెనుమాకలోని వైష్ణవ మహా దివ్య క్షేత్రం ప్రాంగణంలో మంగళవారం నుంచి ఏడాది పాటు (365 రోజులు) అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్, దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23 చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. తొలిరోజు ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభాయాత్ర కనుల పండుగగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన, 8.30కు హనుమత్ ఇష్టి ఉంటుందని తెలిపారు. వైష్ణవ మహా దివ్య క్షేత్రంలో ప్రథమంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యసిద్ది హనుమాన్ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్ తాడికొండ శ్రీనివాసరావు, ఘట్టా ధనప్రసాదరావు, ఉమామహేశ్వరగుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భావన్నారాయణ పాల్గొన్నారు. -
నాలుగో రోజు ఏడు నామినేషన్లు
అద్దంకి: నామినేషన్ల పర్వం మొదలైన తరువాత నాలుగో రోజు ఏడు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డిది కాగా, రెండోది ఆయన భార్య పానెం ఆదిలక్ష్మి దాఖలు చేశారు. మిగిలిన ఐదింటిలో మందా శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాసులు ఇండిపెండెంట్లుగా వేశారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున బాచిన రాంబాబు, నవోదయం పార్టీ తరఫున గుంటుపల్లి గోపీ వేశారు. యార్డుకు 95,448 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు):గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 95,448 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 93,891 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. -
‘పాలేటి’ పెత్తనం మాకొద్దు !
చీరాల: ఎన్నికల వేళ చీరాల టీడీపీలో చీలికలు ఆ పార్టీని పెద్ద కుదుపునకు గురి చేసింది. అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యతో విభేదించి అసమ్మతి నేతలు మరీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ ముఖ్య నాయకులు కొందరు అసంతృప్తితో ఉండగా తాజాగా పార్టీ పట్టణ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు ఒక్కసారిగా పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తారు. కొండయ్య పరిపక్వత లేని రాజకీల కారణంగానే తాము పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొంటున్నారు. నియోజకవర్గ టీడీపీలో జరుగుతున్న నిర్లక్షవైఖరిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొండయ్య తమను పట్టించుకోక పోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన పాలేటి రామారావు పట్టణంలో పెత్తనం చెలాయిస్తూ తమను కాదని మరో వర్గాన్ని బూత్ కన్వీనర్లుగా కమిటీలు వేయడంతోనే ఈ వివాదం రాజుకుంది. అసలు ఏమి జరిగిందంటే.. ? పాలేటి రామారావు పార్టీలోకి చేరిన తరువాత అధిష్టానం టీడీపీ సీటును కొండయ్యకు కేటాయించింది. దీనికి ముందుగానే పాలేటి ఒక అడుగు ముందుకేసి సొంత ప్రయత్నం చేసి టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత కొండయ్య, పాలేటి మధ్య చర్చలు జరిగాయి. పలు దఫాల చర్చల తరువాత పాలేటి, కొండయ్యకు సహకరించేందుకు అంగీకరించారు. అయితే, గత ఎన్నికల్లో పార్టీ గెలుపు మొత్తం తన భుజాన వేసుకున్నానని, ఈ సారికూడా నియోజకవర్గం బాధ్యతలు తమకి అప్పగిస్తే కొండయ్యను గెలిపిస్తానని పాలేటి అన్నట్లు సమాచారం. దీనికి అంగీకరించకపోవడంతో చీరాల రూరల్, వేటపాలెం మండలం నేరుగా చూసుకుంటే, పట్టణ బాధ్యతలు పాలేటి చేపట్టే విధంగా ఒప్పందం కుదిరింది. పాలేటి తనదైన శైలిలో అప్పటికే నిర్ణయించిన బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులను కాదని తనదైన వ్యూహ రచనతో అనుకూల వర్గంతో కొత్త కమిటీలను నియమిస్తున్నారు. పాలేటి కావాలో, కొండయ్య కావాలో తేల్చుకోండి? విషయాన్ని తెలుసుకున్న పాత కమిటీ సభ్యులు కొండయ్య, పాలేటిలను విభేదించి బుధవారం రాత్రి గోలు సదాశివ కల్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. పాలేటిని తీవ్రంగా విమర్శించారు. పాత కమిటీల్ని కాకుండా తమకు అనుకూలంగా ఉన్న వారితో కమిటీలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాలేటి రామారావు ముఖ్య అనుచరులు నాయకులంతా వైఎస్సార్ సీపీలోని కరణం వెంకటేష్ వెనక ఉన్నారని, వారిని పాలేటి ఎందుకు తీసుకు రాలేక పోయారని విమర్శించారు. చీరాల టీడీపీలో గూడు పుఠాని రాజకీయం జరుగుతోందని, అందుకే తాము పార్టీకి వ్యతిరేకంగా పట్టణ పార్టీ బూత్ కమిటీ సమావేశం జరిపి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. వారు పాలేటి కావాలో.. తాము కావాలో తేల్చుకోవాలని అభ్యర్థి కొండయ్యకి అల్టిమేటం ఇచ్చారు. ఇది ఎన్నికల వేళ టీడీపీకి ఇది భారీ ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. చీరాల టీడీపీలో మళ్లీ చీలికలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, బూత్ కన్వీనర్ల ఆక్రోశం చీరాల టీడీపీలో చీలికలు టీడీపీ అభ్యర్థి కొండయ్యకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం పార్టీలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన -
‘కూటమి’ ప్రచారమంతా మాయ
నగరం: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కోరారు. మండలంలోని బొరమాదిగపల్లి, చల్లమ్మ అగ్రహారం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, వెలమవారిపాలెం, చిరకాలవారిపాలెం, పమిడిమర్రు, సజ్జావారిపాలెం, ఉల్లిపాలెం గ్రామాలలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ మోపిదేవి పాల్గొని మాట్లాడారు.సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటకు పాలన అందించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖల్ని మార్చి మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు.సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డిని రెండోసారి గెలిపించాలని కోరారు.టీడీపీ కూటమి మరలా ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. 2014లో కూటమిగా ఏర్పడి ఎన్నో హమీలిచ్చి అధికారంలో వచ్చి, తర్వాత ప్రజల్ని మోసం చేశారని గుర్తుచేశారు.సంక్షేమం, అభివృద్ధి కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రేపల్లె వెఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి సందిగం సురేష్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలతో స్వాగతం పలుకుతూ మహిళలు హారతులిచ్చారు. ప్రచారంలో భాగంగా నేతలు పలు గ్రామాలలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, నియోజకవర్గ పరిశీలకులు అడపా శేషు, బౌడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైఎస్సార్ సీపీ నాయకులు మోపిదేవి హరినాథబాబు, మోపిదేవి రాజీవ్, డాక్టర్ సృజన్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షం సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బాపట్ల ఎంపీ, రేపల్లె అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్ధులను గెలిపించాలి వైఎస్సార్ సీపీ గెలుపుతోనే సంక్షేమ పథకాల అమలు -
కలెక్టరేట్లో వ్యయ విభాగాల పరిశీలన
నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి వ్యయ పరిశీలకులుగా నియమించబడిన సుమీత్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమించబడిన గౌతమన్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఎల్.శివశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకుల విభాగం, కమాండ్ కంట్రోల్ సెంటర్, మీడియా సెంటర్ను తనిఖీ చేశారు. పలు రికార్డుల్ని పరిశీలించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూం సిబ్బందికి, వ్యయ పరిశీలక విభాగ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. యార్డులో 88,176 బస్తాల మిర్చి కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 88,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 83,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 19,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,946 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.హనుమజ్జయంతి ఏర్పాట్లకు శ్రీకారం హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా వైభవంగా నిర్వ హించే హనుమజ్జయంతి ఉత్సవాల ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థానం ప్రాంగణంలో రాటా ఉత్సవంతో ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యు లు, అర్చకుడు శృంగారం వెంకట శేషారామానుజాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ పందిరి ఏర్పాటుకు రాటా కర్రను ప్రతిష్టించారు. హనుమజ్జయంతి ఉత్సవాలను మే 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. దెందులూరు ఏఎంసీ చైర్మన్ అప్పక కనకదుర్గాప్రసాద్, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్లు నెరుసు భూషణం, కొండేటి కనకదుర్గారావు, పుర ప్రముఖులు సుంకర సుభాష్చంద్రబోస్, నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, మేడేపూడి రామ్మోహనరావు, తాడి రంగారావు పాల్గొ న్నారు. నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళం మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కేతినేని రత్నాకరరావు, లక్ష్మీ శమంతకమణి దంపతులు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. గురువారం ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఈ విరాళాన్ని ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. దాత కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నిమ్మకాయల ధరలు తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,500, గరిష్ట ధర రూ.6,400, మోడల్ ధర రూ.5,500 వరకు పలికింది. -
జగనన్న పాలనలో మేలుని చూసి ఓటు వేయండి
పర్చూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ పర్చూరు (చినగంజాం): జగనన్న పాలనలో ప్రతి కుటుంబానికీ జరుగుతున్న మేలుని చూసి వైఎస్సార్ సీపీకి ఓటెయ్యాలని పర్చూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ కోరారు. మండలంలోని ఏటీ ఉప్పరపాలెం, కొత్తపాలెం, చెరుకూరు గ్రామాల్లో గురువారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఏదో ఒక పథకం ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని తెలిపారు. లబ్ధి పొందిన వారంతా వైఎస్సార్ సీపీని తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. బాపట్ల పార్లమెంటుకు పోటీ చేస్తున్న నందిగం సురేష్తో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భౠగంగా ప్రధాన వీధుల్లో ప్రచార రథంపై పర్యటించారు. ప్రతి గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలు సభ్యుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఇంటిలోని చిన్నారుల్ని ఆప్యాయంగా ఎత్తుకుంటూ కుటుంబ సభ్యులతో మమేకమై ఆయన ఓట్లను అభ్యర్థించారు. గ్రామాల్లో పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 13 న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి వైఎస్సార్సీపీ గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పర్యాటకుల తాకిడి
జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్లను చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు ఇక్కడి బీచ్లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య భారీగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్లకు తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చైన్నె లతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలం. దీంతో పర్యాలకుల సంఖ్యరోజురోజుకూ పెరుగుతోంది. -
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్ బాషా ప్రకటనబాపట్ల: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా విడుదల చేశారు. నామినేషన్ ప్రక్రియను బాపట్ల పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి స్పందన సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ ఈనెల 25 వరకు జరుగుతుందని తెలిపారు. 26న నామినేషన్ పత్రాల పరిశీలన, 29న ఉపసంహరణ ప్రక్రియతో పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అభ్యర్థులు ఎవరైనా వేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు నామినేషన్తో పాటు వివరాలు, ధ్రువీకరణలు సమర్పించాలని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి దగ్గరే ఓటింగ్ దివ్యాంగులు, 85 సంవత్సరాల దాటిన వారిని గుర్తించి ఇంటిటికీ వెళ్లి దరఖాస్తులను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. 22లోగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆర్వోలకు అందిస్తే మే మూడో తేదీ నుంచి 10లోగా హోమ్ ఓటింగ్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకున్న వారికి రిటర్నింగ్ అధికారి వద్ద ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇంటింటికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎక్స్పెండిచర్ టీమ్లు మొత్తం కలిపి జిల్లాలో 357 పనిచేస్తున్నాయని వివరించారు. జిల్లాలో 1,510 పోలింగ్ కేంద్రాలు ఉండగా, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. చెడు నడత కలిగిన వారు, పాత నేరస్తులు, రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. 793 మందితో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 8,819 మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement