-
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
రూ.8.97లక్షల విలువైన 128.27 గ్రాముల ఆభరణాల స్వాధీనం కొవ్వూరు: వివిధ చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడైన చుక్కపల్లి బాబి అనే ప్రవీణ్కుమార్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుంచి 128.27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. గతంలో కొవ్వూరులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఇంటిలోను, ఆరికిరేవుల గ్రామంలో ఒక రేకుల షెడ్లోను, కుమారదేవం, పోలవరంలోను ఇళ్లల్లో పగటి పూట ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగ దు అపహరించుకుని పో యాడన్నారు. సోమవా రం కొవ్వూరు ఏటిగట్టుపై ఉన్న శివాలయం ఎదురుగా ఉన్న వీధిలో నిందితుడు అద్దెకి ఉంటున్న ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీ సోత్తు విలువ రూ.8,97,190 ఉంటుందన్నారు. నిందితుడు గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన వాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందుతుడిని అరెస్ట్ చేయడంలో ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బంది సహకరించారన్నారు. -
టెన్త్ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి ముందంజ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు. -
విస్తృత తనిఖీల్లో మద్యం పట్టివేత
● 18 మంది అరెస్ట్ ● రూ.2.06 లక్షల నగదు సీజ్ అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అక్రమ రవాణాను పసిగట్టేందుకు దాడులు, తనిఖీల వేగాన్ని మరింత పెంచాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగిన దాడులు, తనిఖీల్లో అక్రమ రవాణాను అడ్డుకుని 18 మందిని అరెస్ట్ చేశారు. నగదు రూ.2.06 లక్షలు సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్లు, స్వాధీనాల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ● అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెంలో నిఘా బృందాలు వాహనాలను తనిఖీ చేసి రూ.2.06 లక్షల నగదును సీజ్ చేశారు. ● ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,220 నగదు సీజ్ చేశారు. 4 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● రామచంద్రపురం, ద్రాక్షారామ, పామర్రు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 18.03 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● అమలాపురం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట ముమ్మిడివరం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 83 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 15.51 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ● ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన ఐ.పోలవరం మండలం మురమళ్ల,పశువుల్లంకలలో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోంచుకునేలా భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు. -
రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండిలా..
● టెన్త్ విద్యార్థులకు ఈ నెల 30 వరకు అవకాశం ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల ● మే 24 నుంచి జూన్3 వరకు పరీక్షలు ● త్వరలో టైమ్ టేబుల్ విడుదల రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునఃమూల్యాంకనం (రీ వెరిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎంకు మాత్రమే ఫీజు చెల్లించాలి ఈ ఏడాది పది పరీక్షలు రాసిన విద్యార్థులు పాసైనా/ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30వ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. శ్రీరీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ ఫలితాలు వచ్చినా, రాకున్నా ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఎంకి మాత్రమే ఫీజును సమర్పించాలి. అన్ని రుసుము చెల్లింపులు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేయాలి. శ్రీసీఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపులు ఆమోదించరు. ముఖ్య సూచనలు అభ్యర్థులు వారి దరఖాస్తులను సంబంధిత పాఠశాల హెచ్ఎంలు అటెస్టేషన్ చేయించి, సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. నేరుగా విజయవాడలోని డీజీఈ కార్యాలయం(ఎస్ఎస్సీ బోర్డు)కు పంపించరాదు. దరఖాస్తులు పోస్టు ద్వారా స్వీకరించరు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రీ వెరిఫికేషన్ అంటే పరీక్ష పేపర్లను తిరిగి మొత్తం మూల్యాంకనం చేయరు. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కిస్తారు. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధ్రువీకరిస్తారు. జవాబు పత్రంలో దిద్దని ప్రశ్నలు ఉంటే దిద్ది మార్కులు కేటాయిస్తారు. స్కానింగ్ చేసిన విద్యార్థి జవాబు పత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రీ కౌంటింగ్ విషయంలో మార్కుల మొత్తం మరోసారి కూడతారు. తప్పుగా కూడి ఉంటే సరి చేసి మార్కులు వేస్తారు. అంతేగాని పేపరు విద్యార్థికి ఇవ్వరు. అడ్వాన్స్ సప్లిమెంటరీ దరఖాస్తు ఇలా.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు త్వరలో ప్రకటించనుంది. వచ్చే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు ప్రతీ పాఠశాల హెచ్ఎం/సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ఫీజును నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించే వీలుంది. శ్రీమే ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50ల అపరాధ రుసుంతో ఫీజును చెల్లించే వీలుంది. నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ కోర్సుల్లో చేరేందుకు నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత హెచ్ఎం స్కూల్ లాగిన్ నుంచి పాఠశాలల వారీగా మార్కుల మెమొరాండం, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్ఈఎస్యుఎల్టీఎస్.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ నుంచి ఫలితాలు, షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు. మార్చి–2024, ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల నామినల్ రోల్ ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచుతారు. ఫీజుల వివరాలు చెల్లించాల్సిన ఫీజులను ఆన్లైన్లో ఆయా పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా చెల్లించాలి. డీడీలు స్వీకరించరు. శ్రీరీ వెరిఫికేషన్ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. శ్రీరీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. -
నేత్రపర్వంగా తెప్పోత్సవం
● మేళతాళ మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం ● విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా కాల్పులు ● వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేకువ జామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. స్వామి వారి కల్యాణోత్సవాలు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు శ్రీమాన్ ఖండవల్లి వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వస్తి వచనం, కల్యాణోత్సవ ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం 6 గంటలకు సంకల్పం, ప్రధాన హోమాలు నిర్వహించారు. కేరళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం గౌతమీ గోదావరి నదిలో విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించిన హంస వాహనంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. బాణసంచాకాల్పులు, భక్తజనం గోవింద నామస్మరణ నడుమ స్వామివారు ఉభయ దేవేరులతో గౌతమీ గోదావరిలో విహరించడాన్ని భక్తజనం తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజిపజేశాయి. ఈ కార్యక్రమాలను దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం గౌతమీ గోదావరినదిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. గౌతమీ గోదావరిలో సాగిన స్వామివారి తెప్పోత్సవం -
10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.రఘువీర్ 595 మార్కులు, కె.సుప్రియ 595 మార్కులు, ఏపీఆర్ సాయిశ్రీలత, బి.లలితరాణి, కె.సత్యభాస్కర్ 594 మార్కులు, టి.ప్రీతిశరణ్య, ఎం.ఇబ్రహీం 593మార్కులు, కె.అశ్రిత, ఎంవీఎల్ఎ వాత్సల్య, ఎం.గ్రీషశ్రీ, బియు.ప్రసాద్, పి.శ్రీతుల్య, జేవీఎన్ సత్యసాయిదత్త, వై.తేజశ్వి, ఎస్.రంజిత్కుమార్ 592మార్కులు, వై.కృష్ణచైతన్య, ఎల్.వైష్ణవి, సీహెచ్.లోక్ప్రకాష్, ఎస్వీఎస్.శ్రీధర్, డి.చిన్మయి 591మార్కులు సాధించారన్నారు. 590పైన 34మంది విద్యార్థులు, 580పైన 223 మంది విద్యార్తులు, 570పైన 451మంది, 560పైన 642 మంది, 550పైన 779మంది, 500పైన 451మంది , 560పైన 642మంది, 550పైన 779మంది, 500పైన 1108 మంది విద్యార్థులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
11న జాతీయ లోక్ అదాలత్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించాలని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఆమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి రాజీపడదగిన జాబితాను అధికారులు సిద్ధం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, గవర్నమెంటు ప్లీడరు సీహెచ్వీ ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు జగన్
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి అప్పారి జగన్ జాతీయ బాస్కెట్బాల్ అండర్–17 పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.ఘన సత్యనారాయణ తెలిపారు. ఇటీవల రాయవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో సత్తా చాటిన జగన్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 27వ తేదీన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో జరగనున్న జాతీయ అండర్ –17 బాస్కెట్ బాల్ పోటీల్లో తలపడనున్నాడని చెప్పారు. జాతీయ పోటీలకు ఎంపికై న జగన్ను పాఠశాలలో సోమవారం జరిగిన అభినందన సభలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జగన్ను డీఈవో ఎం.కమలకుమారి, అమలాపురం డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశం, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచిగంటి వెంకటేశ్వరరావు అభినందించారు. -
అభిమానుల కోలాహలం మధ్య జగ్గిరెడ్డి నామినేషన్
కొత్తపేటలో నామినేషన్ వేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేట డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ, అసెంబ్లీ ఎన్నికల అధికారి జి.వి.వి.సత్యనారాయణకు నామినేషన్ సమర్పించారు. జగ్గిరెడ్డి నామినేషన్కు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో రావులపాలెం – కొత్తపేట రహదారి, కొత్తపేట రోడ్లు జనసంద్రంగా మారాయి. జగ్గిరెడ్డి గోపాలపురంలో తన స్వగృహం వద్ద నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారు వెంట ర్యాలీగా రాగా జగ్గిరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తపేట చేరుకుని నామినేషన్లు సమర్పించారు. జై జగన్... జై జగ్గిరెడ్డి అనే నినాదాలు హోరెత్తాయి. జగ్గిరెడ్డి వెంట అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వర ప్రసాద్ కూడా ఉన్నారు. జగ్గిరెడ్డితోపాటు ఆయన సతీమణి లావణ్య 2 సెట్ల నామినేషన్లు వేశారు. -
నన్నయ వీక్షిత్ భారత్
రాజానగరం: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. యూనివర్సిటీ 18వ ఫౌండేషన్ డేని పురస్కరించుకుని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన వీక్షిత్ భారత్ థీమ్ కార్యక్రమాలను వీసీ ప్రారంభించారు. శ్రీరాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కానవరం విద్యార్థులు ఉదయం యోగ ఆసనాలు వేయించి, యోగ సాధన ఆవశ్యకతను తెలియజేశారు. మధ్యాహ్నం వీక్షిత్ భారత్ 2047 థీమ్ ఓరియెంటెడ్ డాన్స్, మైమ్, స్కిట్స్లను క్యాపంస్, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించారు. సీటీఆర్ఐ డైరెక్టర్ ఎం.శేషుమాధవ్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆవిర్భావ లక్ష్యాలను నెరవేర్చే దిశగా యువత పయనించాలని సూచించారు. యూజీసీ వీక్షిత్ భారత్ జాబితాలో శ్రీనన్నయశ్రీ వర్సిటీ ఉండటం హర్షణీయమన్నారు. సీఎస్ఐఆర్ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ జి. భగవాన్ నారాయణ రీసెర్చ్ మెథడాలజీపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజిస్టార్ ఆచార్య జి.సుధాకర్, డాక్టర్ ఎన్.శేషారెడ్డి, డాక్టర్ రామచంద్రరాజు, డాక్టర్ సీహెచ్.సత్యనారాయణ, డాక్టర్ రామరాజు ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. -
కోలహలంగా నామినేషన్లు
22ఎఎంపీ01: వేణుగోపాలరావు నామినేషన్కు వచ్చిన పార్టీ శ్రేణులతో కిక్కిరిసిన పి.గన్నవరం కూడలి అట్టహాసంగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విశ్వరూప్, జగ్గిరెడ్డి, విప్పర్తి, గొల్లపల్లి సాక్షి అమలాపురం: ముహూర్తం కుదిరింది. సార్వత్రిక ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత జిల్లాలో అత్యధికంగా సోమవారం నామినేషన్లు పడ్డాయి. అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, జనసేన, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నాలుగో రోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులుగా 22 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అమలాపురం పార్లమెంటరీ సభ్యుని స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లతో జిల్లాలో ఎన్నికల పండగ వాతావరణం తలపించింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు అభ్యర్థులు పినిపే విశ్వరూప్, చిర్ల జగ్గిరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు, గొల్లపల్లి సూర్యారావుల నామినేషన్లు కోలాహలంగా సాగింది. ఉత్సాహంగా విశ్వరూప్ నామినేషన్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ అట్టహాసంగా నామినేషన్దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జి.కేశవవర్థనరెడ్డికి రెండు జతల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతోపాటు భార్య బేబీ మీనాక్షి కూడా నామినేషన్ వేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వచ్చారు. ప్రచార రథంపై నుంచి విశ్వరూప్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కామనగరువు, హౌసింగ్బోర్టు కాలనీ నల్లవంతెన రోడ్డు, కాటన్ పార్కు మీదుగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. తీన్మార్, డీజే బ్యాండ్, యువకుల మోటార్ సైకిల్ ర్యాలీగా వెంటరాగా విశ్వరూప్ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. కార్యకర్తలు ఉరేగింపులో ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విప్పర్తి నామినేషన్తో పి.గన్నవరం జనసంద్రం పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎ.శ్రీరామచంద్రమూర్తికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుమారుడు రామ్మోహన్రావు ఒక సెట్ నామినేషన్ వేశారు. పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేణుగోపాలరావు తన స్వగృహం నుంచి బయలుదేరి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్లారు. తరువాత అక్కడ నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అట్టహాసంగా గొల్లపల్లి నామినేషన్: రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు మలికిపురం భారీ ఊరేగింపుతో రాజోలు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కు సమర్పించారు. గొల్లపల్లి నామినేషన్ వేసేందుకు వెళ్లున్నప్పుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేయడంతో జై జగన్..జై గొల్లపల్లి నినాదాలు మారుమోగాయి. గొల్లపల్లితోపాటు రాపాక వర ప్రసాదరావు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలో పలువురు నామినేషన్లు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎర్రంశెట్టి వీర వెంకట సత్యనారాయణ రామరాజు, టీడీపీ అభ్యర్థి తరఫున వాసంశెట్టి లక్ష్మీ సునీత, స్వతంత్ర అభ్యర్థిగా గుత్తుల జై శ్రీ సూర్యంద్రనాథ్ బాబుజిలు నామినేషన్లు వేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ బ్లాక్ పార్టీ తరఫున పెమ్మాడి స్వామి, స్వతంత్ర అభ్యర్థిగా దొంగ సత్య రామ్, అనగాడి రేవతి, జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వనచర్ల బాబ్జిలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బహుజన సమాజ్ పార్టీ తరఫున పులపకూర లిలిని ఆసారాణి నామినేషన్ వేశారు. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాబత్తుల ఆనందరావు, జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణలు నామినేషన్లు వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చీపురుమిల్లి కిరణ్కుమార్, మండపేట అసెంబ్లీ నియోజక వర్గానికి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు, వల్లూరి సాయికుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎస్.డేవిడ్ రాజ్ ఒక సెట్ నామినేషన్ వేశారు. -
నిరంతర కృషి, పర్యవేక్షణతోనే..
పదవ తరగతిలో మంచి ఫలితాలు నిరంతర కృషి, పర్యవేక్షణతోనే సాధించగలిగాం. ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలతో పాటు విద్యార్థుల్లో అభ్యసనాలను మెరుగుపర్చడంతోనే ఈ ఫలితాలను సాధించగలిగాం. పది ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలను సాధించుకోవాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, అమలాపురం సంతృప్తికర ఫలితాలు పది ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాలుగవ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే తొమ్మిది స్థానాలు ముందుకు వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే ఈ ఫలితాలు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు. – ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం స్ఫూర్తిదాయకమైన ఫలితాలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన ఫలితాలను సాధించారు. ఇదే ఒరవడిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మున్ముందు కూడా కొనసాగించాలి. ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి. ఉపాధ్యాయులు పడ్డ కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి. – నక్కా సురేష్, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం 22ఎండీపీ121ఎ: 22ఎండీపీ121బి:22ఎండీపీ121సి: -
వైఎస్సార్ సీపీ ఘన విజయం ఖాయం
కొత్తపేట: వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయ మని రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కొత్తపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాపాక విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాదరణ లభిస్తోందన్నారు. జనం మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపా రు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధమైన లబ్ధి పొందని ప్రజానీకం, ప్రస్తుత ప్రభుత్వంలో తాము రూ.లక్షల్లో పొందిన లబ్ధిని వారే వివరిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి తీరా అధికారం చేపట్టాక వాటిని గాలికొదిలేశారని, దానితో ఇప్పుడు ఎన్ని హామీ లిచ్చినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావుపై మూడు పోలీసు కేసులుఅమలాపురం టౌన్: అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై మూడు పోలీసు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై రాస్తారోకోలు చేసి ప్రజా జీవనానికి ఇబ్బంది పెట్టారన్న అభియోగంపై ఆయనపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో ఒక కేసు, అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. 2022, 2023 సంవత్సరాల్లో ఈ కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్థిరాస్థులు తన పేరున 3.32 ఎకరాలు, తన భార్య పేరున 24 సెంట్ల భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. తన సొంతూరు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో 217 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆనందరావు కుటుంబం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఖరీదైన వసతి గృహంలో జీవిస్తోంది. టీడీపీ అభ్యర్థి సుభాష్పై 13 కేసులు రామచంద్రపురం: రామచంద్రపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వాసంశెట్టి సుభాష్పై 13 కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, నిర్భంధం వంటి కేసులు ఉన్నట్లు తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఆయన తెలియజేశారు. తన మీద మొత్తం13 కేసులు అమలాపురం కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు తాను సమర్పించిన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అమలాపురం టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులు ప్రస్తుతం అమలాపురం మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. సూసైడ్ కేసుతో పాటుగా హత్యాయత్నం, నిర్భంధం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠఅన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరి త్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆలయం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారిపై విశాఖపట్నం–విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవా రం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. 22ఆర్సీపీ02: సుభాష్ -
ఫోర్ కొట్టిన కోనసీమ
22ఎండీపీ121: ● పది ఫలితాల్లో జిల్లాకు 4వ స్థానం ● గతేడాది కంటే తొమ్మిది స్థానాలు ముందుకు ● సత్తా చాటిన సర్కారీ స్కూల్స్ ● ఈ ఏడాదీ బాలికలదే పైచేయి ● జిల్లా వ్యాప్తంగా 14,459 మందికి ప్రథమ శ్రేణి రాయవరం/ముమ్మిడివరం: పదవ తరగతి ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యార్థులు 91.88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. గతేడాది జిల్లా పది ఫలితాల్లో 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది తొమ్మిది స్థానాలు ముందుకు వెళ్లి నాల్గవ స్థానంలో నిలిచింది. అదేవిధంగా జోన్–2 పరిధిలో గతేడాది పది ఫలితాల్లో 2వ స్థానంలో నిలువగా ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. ఈసారీ బాలికలదే పైచేయి పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 9,471 మంది బాలురు, 9,316 మంది బాలికలు కలిపి 18,787 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 8,551 (90.29 శాతం), బాలికలు 8,711 (93.51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 18,787 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,262 మంది ఉత్తీర్ణత (91.88శాతం) సాధించారు. పటిష్టమైన ప్రణాళికతో.. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా చేసిన కృషి కారణంగా చెప్పవచ్చు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పాఠశాలల పునఃప్రారంభం నుంచి పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత విద్యా సంవత్సరంలో జూలై నుంచే ఉదయం, సాయంత్రం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులపై పాఠశాలల హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా పర్యవేక్షణ చేశారు. 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకు పదవ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. నవంబర్ నెలాఖరుకు సిలబస్ పూర్తి చేసి, ప్రతి రోజూ రివిజన్ చేపట్టారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు 70 రివిజన్ టెస్టులు తయారు చేసి విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక మార్కు ప్రశ్నలు ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో తయారు చేసి, ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కూడా విద్యాభారతి పేరుతో స్టడీ మెటీరియల్ సరఫరా చేసింది. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేసినట్లుగా పలువురు హెచ్ఎంలు చెబుతున్నారు. 153 పాఠశాలల్లో శత శాతం ఫలితాలు జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో 153 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 47 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, బీసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ యాజమాన్యాలకు చెందిన ఏడు పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధిస్తే, జెడ్పీ యాజమాన్య పరిధిలో 40 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ యాజమాన్య పరిధిలోని 106 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఫలితాలు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పది పరీక్షలు రాసిన 242 మంది విద్యార్థులకు 215 మంది ఉత్తీర్ణత(88.84శాతం) సాధించారు. వీరిలో 110 మంది బాలురకు 97 మంది, 132 మంది బాలికలకు 118 మంది ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్లు డిప్యూటీ డైరెక్టరు పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు జిల్లాలో తొమ్మిది బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా, ఐదు వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులు 31 మంది పరీక్షలకు హాజరయ్యారు. 27 మంది ఉత్తీర్ణులు కాగా, 22 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణి, ఒక విద్యార్థి తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారి యడ్లపల్లి సాంబమూర్తి తెలిపారు. డీఈవో కమలకుమారిని అభినందిస్తున్న విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించి, జిల్లాకే గర్వకారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిలువడం గమనార్హం. మండలాల వారీగా చూస్తే ముమ్మిడివరం మండలం 98.72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 97.84 శాతం ఉత్తీర్ణతతో ఐ.పోలవరం మండలం రెండోస్థానం, 97.70 శాతం ఉత్తీర్ణతతో మలికిపురం మండలం తృతీయ స్థానంలో నిలిచాయి. 83.58 శాతం ఉత్తీర్ణతతో కొత్తపేట మండలం చివరి స్థానంలో నిలిచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 18,787 ఉత్తీర్ణులైన వారు 17,262 ఉత్తీర్ణులైన బాలురు 8,551 ఉత్తీర్ణులైన బాలికలు 8,711 ప్రథమ శ్రేణి 14,459 ద్వితీయ శ్రేణి 1,970 తృతీయ శ్రేణి 833 590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యార్థి పేరు పాఠశాల మండలం పొందిన మార్కులు పినపోతు ఈషిత జెడ్పీహెచ్ఎస్,ఓడలరేవు అల్లవరం 595 నూకపెయ్యి నవనీత్ జెడ్పీహెచ్ఎస్, చప్పిడివారిపాలెం కొత్తపేట 593 అక్కల బిందు శరణ్య జెడ్పీహెచ్ఎస్, గొల్లవిల్లి ఉప్పలగుప్తం 592 మల్లేశ్వరపు శిరీష జెడ్పీహెచ్ఎస్, ఏడిద మండపేట 591 బొంతు హర్షిత జెడ్పీహెచ్ఎస్,మొగలికుదురు మామిడికుదురు 590 అడబాల సూర్య జెడ్పీహెచ్ఎస్ మలికిపురం 590 నాగదేవి కీర్తన కేశనపల్లి గిడుగు శ్రీరామదుర్గ జెడ్పీహెచ్ఎస్, పెదపట్నంలంక మామిడికుదురు 590 -
ఎన్నికలకు ప్రత్యేకాధికారుల నియామకం
సాక్షి అమలాపురం: జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ఇద్దరు సాధారణ పరిశీలకులు, ముగ్గురు వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేశ్వర్ గోయల్ (ఐఏఎస్), ప్రదీప్ కుమార్ (ఐఏఎస్) సాధారణ పరిశీలకులుగా, ఉమేష్ కుమార్ (ఐఆర్ఎస్) పార్లమెంట్ స్థానానికి వ్యయ పరిశీలకులుగా, రాహుల్ ధింగ్రా (ఐఆర్ఎస్), సుమిత్ దాస్ గుప్తా (ఐఆర్ఎస్)లను ఏడు అసెంబ్లీ స్థానాలకు వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించిందన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా నిర్వహించాలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉమేష్కుమార్ తెలిపారు. అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, ఫ్లయింగ్ బృందాలతో కలెక్టరేట్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖర్చుల గణనపై అవగాహన కల్పించారు. ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చేపట్టిన గణాంకాలపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో వ్యయ పరిశీలకుడిగా పనిచేశానని సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బృందాలు కృషి చేయాలన్నారు. అనుమతులు సక్రమంగా లేని పక్షంలో వాహనాలు ఆర్వో ద్వారా సీజ్ చేయించాలని సూచించారు. నగదు అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. రూ10 లక్షలు దాటి నగదు రవాణా అవుతున్నట్లయితే నగదు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం విక్రయాలు లిక్కర్ షాపుల ద్వారా ఎన్నికల సమయంలో పెరిగినట్టు గుర్తిస్తే నిఘా మరింత పెంచాలన్నారు. అభ్యర్థుల ఊరేగింపులు ర్యాలీలు, బహిరంగ సభల వీడియోలను సక్రమంగా చిత్రీకరించి అకౌంటింగ్ టీమ్కు అందించాలని, అకౌంటింగ్ టీం నిర్దేశిత రేట్ల ప్రకారం అభ్యర్థులకు సంబంధించిన వ్యయాలను గణించాలని సూచించారు. నామినేషన్లు వేసిన తేదీ నుంచి మరింత అప్రమత్తంగా గణాంకాలు చేపట్టాలన్నారు. బ్యాంకులలో నగదు లావాదేవీలు రోజువారీ నివేదికను జిల్లా ఎన్నికల అధికారి ఎల్డీఎంకు సమర్పించాలని సూచించారు. మరో వ్యయ పరిశీలకులు రాహుల్ ధింగ్రా మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం, నగదు, ఉచిత వస్తువులు పంపిణీ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాధారణ ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడుకున్నాయని, అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం పరిమితి విధించినందున ఆ ప్రకారం మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం, నోడల్ అధికారి మురళీకృష్ణ, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్రావు పాల్గొన్నారు. అధికారి పేరు కేటాయించిన స్థానం సెల్ నెం. రాజేశ్వర్ గోయిల్ జనరల్ అబ్జర్వర్ 89789 62588 ప్రదీప్ కుమార్ జనరల్ అబ్జర్వర్ 89775 02588 ఉమేష్ కుమార్ వ్యయ పరిశీలకులు 78935 12588 రాహూల్ ధింగ్రా వ్యయ పరిశీలకులు 89784 52588 సుమిత్ దాస్ గుప్తా వ్యయ పరిశీలకులు 73308 62588 -
మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారంపై సీఎం జగన్ భరోసా
● మేమంతా సిద్ధం సభలో మీ బిడ్డ జగన్ వల్లనే ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటని వెల్లడి ● ముమ్మిడివరంలో మాదిరిగా అందరికీ మంచి జరుగుతుందని హామీ కాకినాడ రూరల్: మత్స్యకారులందరికీ ఓఎన్జీసీ పరిహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు పరిహారం కోసం ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటు చేసిందంటే దానికి కారణం మీ బిడ్డ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ రోజు కమిటీ ఏర్పాటయ్యిందని, ఆ కమిటీ రికమండేషన్ ఆధారంగా ప్రతీ మత్స్యకార కుటుంబానికి మంచి జరిగేటట్టుగా మీ బిడ్డ అండగా ఉంటాడని హామీ ఇస్తున్నానన్నారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యను పరిష్కరించి ముమ్మిడివరంలో మత్స్యకారులకు పరిహారం ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ తీరప్రాంతంలో ఓఎన్జీసీ ఒక సిస్మిక్ సర్వేతో 500 కిలోమీటర్ల మేర ఎక్కడా మత్స్యకారులు వేట చేయకూడదని, 35 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ అని ప్రకటించినప్పుడు మత్స్యకారుల ఉద్యమానికి అండగా నిలిచామన్నారు. తాను, సిటీ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత మత్స్యకారుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడడంతోపాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో కమిటీ ఏర్పాటుకు ఓఎన్జీసీ ముందుకు వచ్చిందన్నారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విజయశంఖారావాన్ని తొలిసభలో పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్మోహన్రెడ్డి మళ్లీ ఇప్పుడు నామినేషన్ల పర్వం ప్రారంభమైన వెంటనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మనందరి తరపున థ్యాంక్యూ సీఎం సార్ అని చెబుతున్నానన్నారు. జగనన్నకు, ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటంటే మీతో పోలికే లేని నాయకుడు చంద్రబాబు తన మందీమార్బలాన్ని, మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటుంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటున్నాడని ఇది చాలు మీకు, ఆయనకు ఉన్న పోలిక ఏమిటో అర్థమవుందని సీఎంను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే.. సంక్రాంతికి పప్పుబెల్లాలను చంద్రబాబు పంచిపెడితే, మీరు ఇచ్చే కానుకలు జీవితాలను నిలబెట్టేవి, భవిష్యత్ తరాలకు తల రాత రాసేవన్నారు. ఇంగ్లిష్ మీడియం మొదలుకుని వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాన్ని మీరు సృష్టించారని, ఇంటి స్థలం, వైద్యం, ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు మీరు అందించి చేయూత, భరోసాలాంటివి కూడా అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్నారని సీఎంకు కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు
రెండోరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి నిల్ అమలాపురం రూరల్: అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి రెండోరోజు నామినేషను బోణీ కాలేదు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరుపుప పొన్నాడ వెంకట సతీష్కుమార్ మూడు సెట్లు, పొన్నాడ నీరజ ఒక సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి పాలెపు ధర్మారావు ఒక సెట్ సత్తిరాజు ఎస్వీయువీఆర్ఎస్ స్వామి బిరా రాజ్కుమార్ ఇండిపెండెంట్లుగా ఒక సెట్ చప్పున ఓక సెట్ నామినేషన్ వేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ తరఫున మతా సుబ్రహ్మణ్యం ఒక సెట్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి జుట్టుక వెంకటరావు ఒక సెట్ నామినేషన్ వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మందపల్లి రవి, నవతరం పార్టీ నుంచి నందికోళ్ల రాజు ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. పవన్ది రాజకీయంలోనూ నటనే ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు బాబి అమలాపురం టౌన్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఇంతకాలం సినిమాల్లో మాత్రమే నటిస్తారనుకున్నాం. ఆయన రాజకీయాల్లోనూ నటిస్తారని ఆయన స్థిరత్వంలేని మాటలే తేటతెల్లం చేస్తున్నాయని ఏపీ అగ్రిమిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో శుక్రవారం మాట్లాడారు. గతంలో టీడీపీ, బీజేపీని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, లోకేష్లపై ఎన్నో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ నోటితోనే నేడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు సినిమాల్లోని ఆయన నటనను ప్రజలకు గుర్తుకు చేస్తోందని బాబి అన్నారు. వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, ఎంపీ పి.మిధున్రెడ్డిని గోదావరి జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న పవన్కళ్యాణ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చదువుకున్నానని చెప్పే ఆయనకు పిఠాపురంతో పనేంటని బాబి ఎదురు ప్రశ్న వేశారు. గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్గా వైఎస్సార్ సీపీని పర్యవేక్షిస్తున్న మిధున్రెడ్డిని పవన్ కళ్యాణ్కి విమర్శించే అర్హత లేదని చెప్పారు. పావలా పవన్ అంటూ తిట్టిన టీడీపీతోనే అంటకాగుతున్న నీ రాజకీయ పరిణితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని బాబి పేర్కొన్నారు. -
భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు
ఈఓ తారకేశ్వరరావు రామచంద్రపురం రూరల్: త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 30 వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబా అమ్మవార్ల గర్భాలయాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి అందజేసిన నర్మద బాణ లింగానికి, శ్రీ చక్ర యంత్రానికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకాలు, కుంకుమార్చనలు ఉదయం 10 గంటలకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు స్వామి, అమ్మవార్లకు ప్రతి నిత్యం ఆర్జిత సేవలు, నిత్య కై ంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. పోక్సో కేసులో జీవిత ఖైదు గోపాలపురం: పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు గోపాలపురం ఎస్పై కర్రి సతీష్కుమార్ శుక్రవారం తెలిపారు. తూర్పుగోదగోపాలపురం పెద్దగూడెం కాలనీకి చెందిన ముప్పడి సంపత్రావు(75)పై 2017లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద తీర్పు చెప్పినట్లు తెలిపారు. ముద్దాయికి జీవిత కాల శిక్షతో పాటు రూ.వేయి జరిమానా, బాధితురాలికి రూ.2లక్షల 50వేలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అక్రమ రవాణాను అడ్డుకుంటున్న నిఘా బృందాలు
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎర వేసే ఏ అక్రమాన్నైనా జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ నిఘా బృందాలు మాటు వేసి అడ్డుకుంటున్నాయి. జిల్లాలో బుధ, గురువారాల్లో జరిగిన దాడులు, తనిఖీలతో పట్టుబడ్డ మద్యం వివరాలను ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ● అమలాపురం, ముమ్మిడివరం, ఆలమూరు, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది కేసులకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసా, 527 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను, 99 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● ఆలమూరు ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.86 లక్షల విలువైన 6,240 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ● జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నరసాపురపుపేటల్లో ఏర్పాటు చేసి జిల్లా చెక్ పోస్టుల వద్ద గురువారం ప్రతి వాహనాన్ని నిలిపి ఆద్యంతం తనిఖీ చేసిన పిదపే నిఘా బృందాలు వదిలాయి. -
No Headline
రావులపాలెం సెంటర్లో జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్జననేత చూసేందుకు తోసుకుంటూ ముందుకు.. అదిగదిగో జగనన్ననవరత్నాలతో తమ బతుకుల్లో వెలుగులు పొదిగిన జగన్మోహనుడి రాక జనానికి ఏరువాకే అయింది. భగభగ మండే వేసవి ఎండలు గుండెల్లో ఉప్పొంగే అభిమానాన్ని ఏమీ చేయలేకపోయాయి. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది మొదలు జనం బ్రహ్మరథం పట్టారు. బాణసంచా కాల్చారు. అడుగడుగునా హారతులు ఇచ్చారు. పూలజల్లులు కురిపించారు. గజమాలలతో స్వాగతించారు. తమ నాయకుడి అభివాదానికి ప్రత్యభివాదంగా రెండు చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. చిరునవ్వులు చిందించే జగనన్న మోమును తమ సెల్ఫోన్లలో బంధించి మురిసిపోయారు. పార్టీ జెండాలే తోరణాలుగా, ఫ్లెక్సీలే స్వాగత ద్వారాలుగా దారిపొడవునా వెల్లువెత్తిన అభిమానంతో బస్సుయాత్ర జాతరను తలపించింది. -
యానాంలో నేడు పోలింగ్
యానాం: పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శుక్రవారం జరిగే మొదటి దఫా పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 33 పోలింగ్ బూత్లకు ఈవీఎంలు తదితర ఎన్నికల సామగ్రితో సిబ్బంది బస్సులో తరలివెళ్లారు. స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకువెళ్లారు. ప్రైసెడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు, వాలంటీర్లు, పోలీసుయంత్రాంగం సైతం ఆయా పోలింగ్బూత్లకు చేరుకున్నారు. యానాంతో పాటు పుదుచ్చేరి ప్రాంతం నుంచి సైతం అదనపు పోలీసు బలగాలు తరలివచ్చా యి. వీరితో పాటు పారా మిలటరీ దళాలను ఆయా పోలింగ్బూత్ల వద్ద నియమించారు. 33 పోలింగ్బూత్లకు 33 ఈవీఎంలతో పాటు రిజర్వుగా మరో 13 ఈవీఎంలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300కు పైగా ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి కోరారు. ఎస్పీ రాజశేఖరన్, సీఐ షణ్ముగం తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
కూటమి ఓ బోగస్ కంపెనీ
● జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు ● మలికిపురంలో ఘన స్వాగతం మలికిపురం: రాష్ట్రంలో జగన్కు వ్యతిరేకంగా కూటమి సాగిస్తున్న రాజకీయం ఓ పెద్ద బోగస్ వ్యవహారమని జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులో బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన పార్టీ నాయకులు కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో మలికిపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏదో సేవ చేద్దామని జనసేనలోకి వెళితే అక్కడ అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలను దోచేద్దామన్న కార్యక్రమానికి కార్యాచరణ రూపొందుతోందని అన్నారు. దీంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. రాజోలు నియోజకవర్గంలోనే టీడీపీ, జనసేన కేడర్కు ప్రణాళిక ఏమీ లేదని, ఇక ప్రజలకు వారు ఏం చేస్తారని అనుమానం వచ్చి బయటకు వచ్చేశానని రాజేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. అమలాపురం ఎంపీగా రాపాక వర ప్రసాదరావు, రాజోలు ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు గెలుస్తారని అన్నారు. పీకే రావు, సూరిశెట్టి బాబి, కొల్లాబత్తుల కుమార్ పాల్గొన్నారు. -
ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
అమలాపురం రూరల్: ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరని నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రాన్ని కలెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు సుమిత్దాస్ గుప్తా, రాహుల్ దింగడాతో కలిసి సందర్శించి కేంద్ర నిర్వహణ తీరును పార్టీల ప్రచార ప్రకటనల ప్రెస్ క్లిప్పింగ్స్ రికార్డుల ఆధారంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యయ పరిశీలకులకు కేంద్రం పనితీరును వివరిస్తూ వివిధ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీడియాకు సూచించారన్నారు. దీని కోసం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి మంజూరు చేయటంతో పాటు, చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వాటి తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందటం కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేసే మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. కులాలను, మతాలను కించపరుస్తూ గానీ, అశ్లీలం, ఇతరుల పరువుకు నష్టం కలిగిస్తూ, హింసను ప్రేరేపించే విధంగా గానీ ప్రకటనలు ఉండరాదన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికా రానికి భంగం కలిగించేలా కానీ, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా గానీ, కోర్టు ధిక్కరణ చేస్తూ గానీ ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశామన్నారు. పేరు పెట్టి వ్యక్తిగత దూషణ చేయరాదని, వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఉండరాదన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, తదితర మత చిహ్నాలను, పోస్టర్లను, సంబంధిత సంగీతాన్ని వినియోగించరాదని తెలిపారు. నిజ నిర్ధారణ లేకుండా ఇతర పార్టీలపైగానీ, ప్రతినిధులపై గానీ ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇవ్వరాదని ఇప్పటికే మీడియాకు తెలియజేశామని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా -
క్లీన్ స్వీప్పై పార్టీ శ్రేణుల గురి
సాక్షిప్రతినిధి, కాకినాడ: నాడు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘తూర్పు’న ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందుకోసం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారి వస్తోన్న జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు మేమతా సిద్ధమంటూ సన్నద్ధమవుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర వచ్చే మార్గంలో ప్రజలు అఖండ స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారున తేతలి రాత్రి బస నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి ఈతకోట, రావులపాలెం, జొన్నాడ జంక్షన్ మీదుగా పొట్టిలంక చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కడియపులంక, మేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీచౌక్, పేపరుమిల్లు సెంటర్, దివాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురంలో రాత్రి బస చేసే శిబిరానికి చేరుకుంటారు. ఆసక్తిగా అభిమానుల ఎదురుచూపులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏర్పాట్లను ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ జిల్లా నేతలు నాలుగైదు రోజులుగా పరిశీలిస్తున్నారు. తొలిరోజు జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, అనపర్తి ఆరు నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సుమారు 85 కిలోమీటర్లు మేర రోడ్షోగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కోసం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బస్సు యాత్ర సాగే దారిపొడవునా ముఖ్యమంత్రి జగన్కు నీరాజనాలు పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర విజయవాడ వచ్చిన సందర్భంలో సింగ్నగర్లో జగన్మోహన్రెడ్డిపై పదునైన వస్తువుతో దుండగుడు దాడి చేయడంతో గాయపడిన అనంతరం జిల్లాకు వస్తుండటంతో అన్ని వర్గాలు జగన్ను కలవాలి, తమ అభిమాన నాయకుడిని పలకరించాలి అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ప్రవేశించే సరికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకోవాలని కోనసీమ వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కోనసీమలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు రావులపాలెం సెంటర్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి నుంచి జాతీయ రహదారి గుండా రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర వెంట జనం వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 19 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు మినహా అన్ని స్థానాల్లోను వైఎస్సార్ సీపీ పాగా వేసింది. 2022 ఏప్రిల్లో జిల్లాల పునర్విభజన జరిగాక తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలైంది. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మూడు జిల్లాల్లో 21 స్థానాలకు 21 సెగ్మెంట్లలో క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి చలించిన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరుశాతం అమలు చేశారు. అందుకే మీ ఇంటిలో మంచి జరిగి ఉంటేనే ఓటేయండని ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా అడుగుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతుందని నేతలు అభిలషిస్తున్నారు. -
రమణీయం.. రత్నగిరి రాములోరి కల్యాణం
అన్నవరం : రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారాముల దివ్యకల్యాణం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం రత్నగిరి రామాలయం పక్కన గల వార్షిక కల్యాణ వేదికపై వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఉదయం పది గంటల నుంచి 12–30 గంటల వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత ప్రముఖుడు, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితర పండితులు నిర్వహించారు. వెండి పల్లకిపై ఊరేగింపు ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వధూవరులు శ్రీసీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ప్రత్యేక సింహాసనం మీద సీతారాములను పండితులు ఉంచారు. ఆ సింహాసనం పక్కనే గల మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు అమ్మవార్లను ఉంచారు. ఉదయం 10–15 గంటలకు విఘ్నేశ్వరపూజతో సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ఈఓ కె.రామచంద్రమోహన్ సీతారాములకు నూతన పట్టువస్తాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల తల్లితండ్రులు, వారి గోత్రనామాలతో కూడిన ప్రవరను ఛామర్తి కన్నబాబు వివరించారు. తరువాత పుణ్యాహవచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్య ధారణ, వైభవంగా తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు వేదపండితులు ఆశీస్సులందజేశారు. తరువాత సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణం సమయంలో భక్తులకు ఆచారం ప్రకారం తాటియాకుల విసనకర్రలు పంపిణీ చేశారు. శ్రీసీతారాముల కల్యాణం అనంతరం శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు నిత్య కల్యాణం అదే వేదికపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2–30 గంటల వరకు నిర్వహించారు. ఆలయ ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఈఓ కల్యాణానికి ముందు కన్నుల పండువగా ఊరేగింపు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement