-
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
విజయవాడ: గన్నవరం నుంచి దేశ వాణిజ్య రాజధానిగా చెప్పే ముంబైకి మరికొన్ని రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది.ప్రారంభ ఆఫర్గన్నవరం నుంచి ముంబైకి నడపనున్న డైరెక్ట్ విమాన సర్వీస్కి ప్రారంభ ఆఫర్గా టికెట్ ధరను రూ.5600గా ఎయిర్ఇండియా నిర్ణయించింది. తర్వాత డిమాండ్ను బట్టి ఈ ధర మారే అవకాశం ఉంది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబైకి చేరుతుంది. అంటే ప్రయాణ సమయం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే.ఇప్పటి వరకూ విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు లేదు. చాలా విమానాలు హైదరాబాదు మీదుగా కనెక్టింగ్ సర్వీసుగా వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు కావాలని నగరంలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా వెంటనే స్పందించింది. విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభ ఆఫర్గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 తగ్గింపు ఇచ్చింది.గన్నవరం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వ్యాపారపరంగా కీలకమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో విజయవాడ-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. -
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్లో రూ. 97.4 కోట్లతో అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్కే, 5 బీహెచ్కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!
ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా స్వయం సహాయక బృందాల నుంచి ఆఫీసర్ల వరకు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించే యత్నం చేశారు. అలానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కూడా చేరి తన వంతుగా ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించింది. ఓటు వేస్తే మా రెస్టారెంట్లలో తక్కువ బిల్లుకే మంచి భోజనం తినొచ్చు అంటూ చక్కటి 'డెమోక్రసీ డిస్కౌంట్'ని అందిచింది కస్టమర్లకు. ఎక్కడంటే..ముంభైలోని నేషనల్ రెస్టారెంట్ అసోసీయేషన్ ఆప్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో బయటకు వెళ్లేందుకు కారణం కోసం చూస్తున్నారా! ఐతే ఇది మీకు మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఓటువేసినట్లు సిరా చుక్క వేయించకున్నా.. మీ వేలుని చూపించి ముంబై నగరంలోని రెస్టారెంట్లో చక్కటి భోజనం ఆస్వాదించి బిల్లులో 20% డిస్కౌంట్ పొందండి అంటూ ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. నగరంలో దాదాపు వంద రెస్తారెంట్లు ఈ ఆఫర్ని అందిస్తున్నాయిని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నం అని ముంబై ఎన్ఆర్ఏఐ సీఈవో రాచెల్ గోయెంకా చెప్పారు. మహారాష్ట్రలో మే 20, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా వినూత్నమైన రీతీలో ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. ఇప్పటికే ముంభైలో సుమారు 150 రెస్టారెంట్లు ఈ ఆపర్లను అందిస్తున్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన డెమోక్రసీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చే రెస్టారెంట్ల పూర్తి జాబితాను కూడా వెల్లడించారు. మీ సమీపంలో ఉన్న రెస్టారెంట్ని ఎంచుకుని చక్కగా ఓటు వేసి 20% డిస్కౌంట్లో చక్కటి భోజనం ఆస్వాదించడని చెబుతున్నారు గోయెంకా. (చదవండి: వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!) -
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్లోని ముగ్గురు గాయకులు... నతనియ లాల్వాని, సుభి, షల్మాలి ఖోల్గాడేలు ‘వావ్’ అనుకునేపాటను తీసుకువచ్చారు. ఈ కొత్త సాంగ్ ‘ముంబై మ్యాజిక్’ నిజంగానే మ్యాజిక్ చేసింది.హెరిటేజ్, హాసల్, హోప్ అనే మాటలతో రూపుదిద్దుకున్నపాట ఇది. ‘ముంబైవాసిగా ఈపాట నన్ను ఎన్నో జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లింది’ అంటుంది నతనియ. ‘దేశీ ఎట్ హార్ట్’ అని తన గురించి పరిచయం చేసుకునే సుభి న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిల్స్లాంటి ఎన్నో ్ర΄ాంతాలలో నివసించింది. అయినప్పటికీ స్వదేశీ మూలాలకు ఎప్పుడూ దూరం కాలేదు.బ్రాడ్వే, జాజ్లాంటి డిఫరెంట్ మ్యూజిక్ జానర్స్కు దేశీ టచ్ ఇచ్చింది.‘ఎన్నో విలువైన జ్ఞాపకాలకుపాట రూపం ఇచ్చే అవకాశం దక్కింది’ అంటుంది ‘ముంబై మ్యాజిక్’ గురించి. ‘ముంబై మహానగరంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేపాట ఇది. ముంబై నగర ముఖచిత్రాన్ని వివిధ వర్ణాలలో అందంగా చూపినపాట. నగరంలోని వేగాన్ని, నిశ్శబ్దాన్ని, వెలుగు, నీడలను పట్టించేపాట ఇది’ అంటుంది షల్మాలి.ఇవి చదవండి: ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'... -
ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి. రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కాగా ముంబైలోని ఘాట్కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్పుర్కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్పుర్కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్బోర్డ్ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్పై కుప్పకూలింది. -
‘హోర్డింగ్’ అనుమతులపై విచారిస్తున్నాం
దాదర్: ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన 14 మంది మృతిచెందిన దుర్ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపరిచింది. మృతులు, గాయపడ్డవారి బంధువుల ఆందోళన నేపథ్యంలో అసలు ఈ భారీ హోర్డింగ్కు ఎవరు? ఎలా అనుమతిచ్చారన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఈదురు గాలులు, దుమ్ము, ధూళితో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల పలు హోర్డింగులు, చెట్లు నేలకూలాయి.ఇదే క్రమంలో ఘాట్కోపర్లోని ఓ పెట్రోల్ బంకు షెడ్డుపై 120/120 అడుగుల భారీ హోర్డింగ్ కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆకస్మాత్తుగా కురిసిన భారీవర్షం, ఈదురు గాలుల వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయమేర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో అగి్నమాపక వాహనాలు, అంబులెన్స్లు సంఘటన స్ధలానికి చేరుకొనేందుకు తీవ్ర ఆలస్యమైంది దీంతో అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సహాయ చర్యలు కొనసాగాయి. ఐతే వీరిలో తీవ్ర గాయాలపాలైన కొందరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని, దీంతో మృతుల సంఖ్య 14కు చేరిందని చడ్డానగర్ పోలీసులు తెలిపారు. హోర్డింగ్పై బీఎంసీకి మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య లేఖ నేల కూలిన భారీ హోర్డింగ్ పునాదులు, వెల్డింగ్ చేసిన ఇనుప పట్టీలు చిలుము పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తొలగించాలని స్ధానిక మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య బీఎంసీకి గతంలో లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన బీఎంసీ కమిషనర్ (అడ్మిన్) భూషన్ గగ్రానీ రెండు రోజుల కిందటే హోర్డింగ్ యజమానికి నోటీసు జారీ చేశారు. ఈలోగానే సోమవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఈ భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు షెడ్డుపై కూలింది. ఘటన జరిగిన సమయంలో బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కోసం పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు, టెంపోలు, ఇతర వాహనాలు క్యూలో ఉన్నా యి.వీరే కాకుండా ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో అనేక మంది ద్విచక్ర వాహన చోదకులు తల దాచుకునేందుకు బంకు షెడ్డు కిందకు చేరుకున్నారు. అలాగే భారత్ పెట్రోలియం బంకు సైన్ ప్రాంతం తర్వాత చడ్డానగర్లోనే ఉంది. ఆ తరువాత ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హై వేపై థానే వరకు భారత్ పెట్రోలియం బంకులు లేవు. దీంతో చడ్డానగర్లో హైవేకు ఆనుకుని ఉన్న ఈ పెట్రోల్ బంకు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.సోమవారం సాయంత్రం కూడా బంకులో ఇదే పరిస్థితి ఉండటం, అదే సమయంలో భారీ హోర్డింగ్, బంకు పైకప్పు కూలడంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, అగి్నమాపక అధికారులు తీవ్రంగా శ్రమించారు. కార్లపై హోర్డింగ్, పెట్రోల్ బంకు పైకప్పు కూలడంతో కార్ల డోర్లు జామ్ అయ్యాయి. వాహనాలకు సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టం ఉండడంవల్ల ఇంజన్ (ఆన్లో ఉంటేనే) పని చేస్తేనే డోర్లు తెరుచుకుంటాయి. దీంతో పలువురు కార్లలోనే ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణమైందని, క్షతగాత్రులను 40 అంబులెన్స్ల ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.గాలి తీవ్రత వల్లే.. ప్రమాదంఘాట్కోపర్ పరిసరాల్లో నాలుగు భారీ హోర్డింగులున్నాయి. సోమవారం నేల కూలిన హోర్డింగ్ రైల్వే పోలీసు క్వార్టర్స్ పరిధిలో ఉంది. మహరాష్ట్ర స్టేట్ పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఉన్న ఈ స్థలంలో ప్రమాదానికి గురైన హోర్డింగ్కు రైల్వే మాజీ కమిషనర్ కేసర్ ఖాలీద్ హయాంలో అంటే 2021లో 10–20 ఏళ్ల కాలవ్యవధి కోసం అనుమతిచి్చనట్లు తెలుస్తోంది. బీఎంసీ నిబంధనల ప్రకారం ఒక్కో హోర్డింగు 40/40 అడుగుల ఆకారంలో ఉండాలి. కానీ ఈ హోర్డింగులు ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 120/120 అడుగుల ఆకారంలో ఉండడంవల్ల గాలి వేగాన్ని తట్టుకోలేక కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.హోర్డింగ్ యజమాని, ఈగో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సంచాలకుడు భావేష్ భిడేపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడనే అభియోగం మోపుతూ స్ధానిక పంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ అనుమతులకు సంబంధించి కేసర్ ఖాలీద్ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని, అనంతరం కేసు దర్యాప్తును పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర శిసావే వెల్లడించారు. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
నేషనల్ క్రష్గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్తో హిట్ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది. ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. #WATCH | Mumbai: On the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu, Actor Rashmika Mandana says, "Who would have thought that something like this would have been possible. Now we can easily travel from Mumbai to Navi Mumbai. India is moving very fast and growing at a fast pace.… pic.twitter.com/ACwSoSNaa7— ANI (@ANI) May 14, 2024 -
హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. అలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు.ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో స్థానికంగా పెట్రోల్పంపు వద్ద 100 అడుగుల ఎత్తైన బిల్బోర్డ్ ఒక్కసారిగా కుప్పుకూలి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ముంబయి ఆధునిక మహానగరంగా మారుతుంది. సీఎం అన్ని హోర్డింగ్లపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు పాటించాలి’ అని ట్వీట్ చేశారు.గాయపడిన వారిలో 31 మందిని రాజావాడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. హోర్డింగ్ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.14 dead.Om Shanti 🙏🏽60 injuredFrom a billboard collapse.Unacceptable. And we’re a city trying to transform itself into a modern metropolis. CM @mieknathshinde has ordered a probe into all hoardings.Stringent rules must follow.pic.twitter.com/DxvsaoBm0l— anand mahindra (@anandmahindra) May 14, 2024 -
ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
ముంబై, సాక్షి: ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్కోపర్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదుర గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.Breaking : Death Toll in the Mumbai Hoarding collapse rises to 8. 30 still feared trapped. How is the crushing of 8 people , under a 100 ft hoarding , in India's financial capital NOT a news priority on Prime Time TV ? pic.twitter.com/G29jzn47IH— Shreya Dhoundial (@shreyadhoundial) May 13, 2024 #WATCH | Ghatkopar hoarding collapse incident | Latest visuals from the accident spot; rescue and search operation underway8 people have died and approximately 20-30 are trapped under the hoarding which collapsed in Maharashtra's Ghatkopar. pic.twitter.com/OFCajrg7iT— ANI (@ANI) May 13, 2024 సోమవారం సాయంత్రం 4గం.30 ప్రాంతంలో.. గాలుల ధాటికి ఘాట్కోపర్లోని సమతా నగర్లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g— ANI (@ANI) May 14, 2024 ఇక దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది.#WATCH | Ghatkopar hoarding collapse incident | Maharashtra CM Eknath Shinde says, "...Rescuing the people is our priority. Government will take care of the treatment of those who are injured in the incident. Rs 5 lakh will be given to the family of those who have lost their… pic.twitter.com/uMPQjJLQ90— ANI (@ANI) May 13, 2024 వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
ముంబై అతలాకుతలం..బీభత్సం సృష్టించిన గాలివాన (ఫొటోలు)
-
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై: ముంబై మహా నగరాన్ని వర్షం ముంచెత్తింది. ముంబై ప్రధాన నగరంతో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లో సోమవారం(మే13) భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.సాయంత్రం 5గంటలకు విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు. సర్వీసులను నిలిపివేసిన సమయంలో మొత్తం 15 విమానాలను డైవర్ట్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. వర్షం వల్ల మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్ల మీద చెట్లు విరిగి పడిపోయాయి. -
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
ఉరుములు, మెరుపులతో కురిసిన ముంబై నగరవాసులకు ఊరటనిచ్చింది. ఈ సీజన్లో ముంబైలో తొలి వర్షాలు వేసవి వేడి నుంచి కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం మధ్యాహ్నం ముంబై, థానే , పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ దుమ్ము తుఫాను సంభవించింది. దీంతో పాలు ప్రాంతాల్లో చీకటి ఆవరించింది. వాతావరణ శాఖ ప్రకారం, ముంబైలో తేలికపాటి వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురువనున్నాయి.Mumbai currently looks like a Hollywood movie shot in Mexico pic.twitter.com/CeJRqEDEdL— Sagar (@sagarcasm) May 13, 2024ముంబైలోని ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి.Mumbai is on Strom alert ⚠This is so beautiful 😍#mumbairainspic.twitter.com/ES7uiEqIbW— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) May 13, 2024 ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) థానే, పాల్ఘర్, రాయ్గడ్, షోలాపూర్, లాతూర్, బీడ్, నాగ్పూర్, రత్నగిరి , సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.పూణే, సతారా, సాంగ్లీ, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్నగర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. రాగల రెండు గంటల్లోల థానే ,పాల్ఘర్, కళ్యాణ్, బద్లాపూర్ , ఇంటీరియర్లలో రాబోయే 2 గంటలలో భారీ వర్షం కురుస్తుంది. నివాసితులు ఇళ్లలోనే ఉండటం మంచిది. గంటకు 40-50 కిమీ వేగంతోగాలులు వీచే అవకాశం ఉంది.📌Mod to intense thunderstorms over Red marked areas; District of Thane, Palghar, Raigad, Nagar & eastern suburbs of Mumbai during next 2 hrs. Mulund, Tiltwala, Kalyaan📌Mod to severe thunderstorms over yellow areas covering South ghat areas of Pune, Satara next 2,3 hrsWatch pl pic.twitter.com/WF7qd7LWsE— K S Hosalikar (@Hosalikar_KS) May 13, 2024 -
Lok Sabha Election 2024: నికమ్ వర్సెస్ వర్షా
ముంబై నార్త్ సెంట్రల్. మినీ ముంబైగా పేరొందిన లోక్సభ స్థానం. ఆకాశాన్నంటే హార్మ్యాలతోపాటు మురికివాడలు ఇక్కడి ప్రత్యేకత. సెల్రబిటీలతో పాటు వలస కారి్మకులకూ నివాస స్థానం. మే 20న ఐదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ నుంచి పార్టీ ముంబై చీఫ్ వర్షా గైక్వాడ్ బరిలో ఉన్నారు. గత రెండుసార్లూ గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తుండగా, తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఉవి్వళ్లూరుతోంది...చట్టాలను సవరిస్తా.. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను పక్కన పెట్టిన మరీ ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్కు టికెటిచి్చంది. పూనం తండ్రి, బీజేపీ దిగ్గజం ప్రమోద్ మహాజన్ హత్య కేసును వాదించింది ఉజ్వలే కావడం విశేషం! ‘‘ఆ సమయంలో పూనంను దగ్గరగా చూశా. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆమె ఈసారి నా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని నికమ్ చెబుతున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడి వంటి హై ప్రొఫైల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నికమ్ వాదించిన తీరును బీజేపీ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. ‘‘రాజకీయాలు నా సెకండ్ ఇన్నింగ్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. అదే నన్ను గెలిపిస్తుంది’’ అని నికమ్ ధీమాతో ఉన్నారు. ‘‘ప్రజల కోసం మేలైన చట్టాలను రూపొందించడానికి కృషి చేయాలనుకుంటున్నా. పారిపోయిన నేరగాళ్లను భారత్కు తీసుకువచ్చేలా అప్పగింత చట్టాలను సవరించాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. వంచిత్ బహుజన్ అగాడీ, మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబై నార్త్ సెంట్రల్లో పోటీలో ఉన్నారు. రాజ్యంగ రక్షణ పోరాటంముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తండ్రి ఏక్నాథ్ గైక్వాడ్ గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వర్ష ప్రచారం ప్రారంభించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శివసేన సభ్యులు పారీ్టలో చీలిక తర్వాత ఉద్ధవ్ వెంటే ఉండటం కలిసొచ్చే అంశమని వర్షా అంటున్నారు. ‘‘ముంబై నార్త్ సెంట్రల్ తొలినుంచీ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి నా విజయాన్ని పార్టీకి కానుకగా అందిస్తా’’ అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.వలస ప్రజల నిలయం... ముంబై ‘మినీ ఇండియా’ అయితే ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ స్థానం ‘మినీ ముంబై’. ఇందులో విలే పార్లే, చండీవలి, బాంద్రా, కలీనా, కుర్లా వంటి ప్రాంతాలున్నాయి. బాంద్రా, ఖర్లలో సినీ తారలు, ప్రముఖులు నివసిస్తారు. కుర్లాలో వలస కుటుంబాలు, కారి్మకులు ఎక్కువ. సుమారు 3 లక్షలమంది ఉత్తరాది రాష్ట్రాలవారు, లక్ష మంది దక్షిణాది ప్రజలు, 1.9 లక్షల మంది గుజరాత్, రాజస్థాన్ వాసులు నివసిస్తున్నారు. 3 లక్షలకు పైగా ముస్లింలున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, కాలుష్యం ఇక్కడి ప్రధాన సమస్యలు... – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్ ఉవ్విళ్లూరుతున్నారు.అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్లపై పోటీకి దిగారు.తన సోషల్ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు. -
చాంపియన్ ముంబై సిటీ
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ రెండో సారి విజేతగా నిలిచింది. దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో మోహన్బగాన్ సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. ఆరంభంలో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్పైనే దృష్టి పెట్టాయి. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ సాధించిన గోల్తో ముందుగా మోహన్బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో 3 గోల్స్తో ముంబై చెలరేగింది. ముంబై తరఫున జార్జ్ పెరీరా డియాజ్ (53వ నిమిషం), బిపిన్ సింగ్ (81వ నిమిషం), జాకబ్ వోజస్ (90+7వ నిమిషం)లో గోల్స్ కొట్టారు. 2020–21 సీజన్లో ముంబై విజేతగా నిలిచిన మ్యాచ్లో కూడా ఇదే తరహాలో మోహన్బగాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచినా...బిపిన్ సింగ్ సాధించిన గోల్తోనే ముంబై గెలిచింది. అదనపు సమయంలో మోహన్బగాన్కు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా... ఫార్వర్డ్లు పూర్తిగా విఫలమయ్యారు. కొన్ని క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ముంబై మరో గోల్తో తిరుగులేని విజయా న్ని అందుకుంది. ముంబైకి చెందిన ఫుర్బా లచెన్పాకు ‘గోల్డెన్ గ్లవ్’, విక్రమ్ ప్రతాప్ సింగ్కు ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు, కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ దిమిత్రియోస్ దియామంతకూస్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డులు దక్కగా, మోహన్ బగాన్ ఆటగాడు పెట్రాటోస్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’గా నిలిచాడు. -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
మొబైల్ ఫోన్ టార్చ్లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్ఫేక్ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్ఫేక్లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్లో నడుస్తుంటే బీచ్లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్ఫేక్లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్ఫేక్తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ లాకప్లో ఉన్న నిందితుడు అనుజ్ థాపన్.. బుధవారం ఉదయం 11 గంటలకు లాకప్ గదిలో వాష్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన అనూజ్ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా గత నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్ చందర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.అయితే అనుజ్తోపాటు మరో పదిమంది అదే లాకప్లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారులాకప్లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.టీవీ సీరియల్స్లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్ గోవిల్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు. -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
లండన్ చేరుకున్న సీఎం జగన్
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement