మండాదిలో కలెక్టర్‌ పల్లెనిద్ర | Sakshi
Sakshi News home page

మండాదిలో కలెక్టర్‌ పల్లెనిద్ర

Published Tue, Apr 23 2024 8:25 AM

 పోలింగ్‌ బూత్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ లోతేటి   - Sakshi

వెల్దుర్తి: మండలంలోని మండాది గ్రామంలో కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ. శ్యాం ప్రసాద్‌లు ఆదివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండాది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్‌ బూత్‌లను పరిశీలించి పాఠశాలలో ఏర్పాటు చేసి న గదిలో పల్లె నిద్ర చేశారు. సోమవారం ఉదయం గ్రామంలో తిరిగి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వారికి నచ్చిన పార్టీలకే వేసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఒత్తిడిలు, ప్రలోభాలు పెడితే వెంటనే ఎన్నికల అధికారికి సమాచారమివ్వాలన్నారు. అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని గుండ్లపాడులో ఉన్న నాలుగు పోలింగ్‌ బూత్‌లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఓటర్లతో మాట్లాడా రు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ శ్రీహరిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
Advertisement